ఢిల్లీలో 4.5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

- December 16, 2024 , by Maagulf
ఢిల్లీలో 4.5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వీస్తున్న చలిగాలులతో ప్రజలు వణికిపోతున్నారు. ఢిల్లీలో సోమవారం ఉదయం ఉష్ణోగ్రతలు 4.5 డిగ్రీలకు పడిపోయాయి.సాధారణ ఉష్ణోగ్రతల కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదైనట్లు ఢిల్లీలోని వాతావరణ శాఖ తెలిపింది.మరోవైపు గాలి నాణ్యతలు కూడా తగ్గాయి.ఈ రోజు ఉదయం 9 గంటలకు ఎక్యూఐ 351 వద్ద నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) పేర్కొంది.ఎక్యూఐ వెరీ పూర్‌ కేటగిరీలో వర్గీకరించినట్లు సిపిసిబి తెలిపింది. ఆదివారం రోజు ఎక్యూఐ 294 స్థాయి వద్ద నమోదయ్యాయి.మరలా తెల్లారేసరికి గాలి నాణ్యతలు క్షీణించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com