ఎర్ర సముద్రంలో ఐదుగురిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!

- December 20, 2024 , by Maagulf
ఎర్ర సముద్రంలో ఐదుగురిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!

జెడ్డా: మక్కా ప్రాంతంలోని జెడ్డా గవర్నరేట్‌లోని బోర్డర్ గార్డ్స్‌కు చెందిన సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లు ఎర్ర సముద్రం వద్ద ఓడ మునిగిపోయిన ఘటనలో ఐదుగురు సౌదీ పౌరులను రక్షించారు. సహాయక చర్యలు చేపట్టి వారికి అవసరమైన సహాయాన్ని అందించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్స్ సముద్ర భద్రత మార్గదర్శకాలను పాటించాలని, నౌకాయానానికి ముందు సముద్ర నౌకల భద్రతను నిర్ధారించాలని అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయాన్ని కోరుతూ మక్కా, తూర్పు ప్రావిన్స్‌లోని ప్రాంతాలలో ఫోన్ నంబర్‌లు 911.. కింగ్‌డమ్‌లోని మిగిలిన ప్రాంతాలలో 994 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com