రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని మర్యాదపూర్వకంగా కలిసిన హరియాణా గవర్నర్ దత్తత్రేయ

- December 21, 2024 , by Maagulf
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని మర్యాదపూర్వకంగా కలిసిన హరియాణా గవర్నర్ దత్తత్రేయ

హైదరాబాద్: హరియాణా గవర్నర్ బండారు దత్తత్రేయ ఈ రోజు సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయం లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. 

దత్తాత్రేయ రాష్ట్రపతికి  శ్రీ కృష్ణుడు మహాభారత యుద్ధభూమిలో తన విశ్వరూపాన్ని ధరించి అర్జునుడికి భగవద్గీత బోధిస్తున్న విరాట్ మూర్తిరూపాన్ని వారికి బహూకరించడం జరిగింది. ఈ సందర్భంగా హరియాణాలోని కురుక్షేత్ర లో అంతర్జాతీయ గీతా మహోత్సవం నిర్వహించినట్లు దత్తాత్రేయ రాష్ట్రపతి దృష్టికి తేవడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com