సంక్రాంతి సెలవులను తగ్గించిన ఏపీ సర్కార్
- December 24, 2024
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు సంక్రాంతి సెలవులపై షాక్ ఇచ్చింది. మార్చిలో పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో, సాధారణంగా ఇచ్చే సెలవుల్ని కేవలం మూడు రోజులకు పరిమితం చేసింది. జనవరి 13, 14, 15 తేదీల్లో మాత్రమే విద్యార్థులకు సెలవులు ఉంటాయని, మిగిలిన రోజుల్లో అదనపు తరగతులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నట్లు ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రోజువిడిచి రోజు పరీక్షలు నిర్వహించనుండటంతో విద్యార్థులు మంచి ప్రదర్శనకు అవకాశముంటుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యేందుకు సమయం దక్కుతుంది.
సంక్రాంతి పండుగ దృష్ట్యా సెలవులు తగ్గించడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. సాధారణంగా సంక్రాంతి సందర్భంగా 10 రోజులకు పైగా సెలవులు ఉండేవి. ఇప్పుడు కేవలం మూడు రోజులు మాత్రమే ఇవ్వడం పట్ల విద్యార్థులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని ప్రభుత్వం అంటున్నప్పటికీ, సెలవులు తగ్గించడంపై విమర్శలు ఎదురవుతున్నాయి.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. మార్చి 1 నుంచి 19 వరకు ప్రథమ సంవత్సరం, మార్చి 3 నుంచి 20 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఇక్కడ కూడా రోజువిడిచి రోజు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ విధానం విద్యార్థులకు ఒత్తిడి తగ్గించడంలో దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!









