టర్కీయేలో బస్సులో మంటలు..35 మంది సౌదీ పర్యాటకులకు తప్పిన ప్రమాదం..!!
- December 25, 2024
ఇస్తాంబుల్: టర్కీయేలో టూరిస్ట్ బస్సులో మంటలు చెలరేగిన ఘటనలో 35 మంది సౌదీ పర్యాటకుల బృందం తృటిలో తప్పించుకున్నారు. టర్కీ మీడియా ప్రకారం.. పర్యాటకులు సోమవారం సాయంత్రం గెబ్జే-ఓర్హంగజీ-ఇజ్మీర్ మోటర్వేలో బుర్సా నుండి ఇస్తాంబుల్కు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. 41 ఏళ్ల బస్సు డ్రైవర్ బస్సు జెమ్లిక్ బ్రిడ్జ్ దగ్గరకు చేరుకున్నప్పుడు ఇంజిన్ నుండి భారీగా పొగలు కమ్ముకోవడం గమనించాడు. మంటలు బస్సును చుట్టుముట్టకముందే ప్రయాణికులను బస్సు నుండి సురక్షితంగా దించివేశారు. దాంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. బస్సు డ్రైవర్ నుంచి సమాచారం అందుకున్న టర్కీ భద్రతా అధికారులు వెంటనే స్పందించారు. సంఘటనా స్థలానికి అగ్నిమాపక దళం మంటలను అదుపు చేసింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి టర్కీ భద్రతా అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం సౌదీ పర్యాటకులను మరో బస్సులో ఇస్తాంబుల్కు తరలించారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







