టర్కీయేలో బస్సులో మంటలు..35 మంది సౌదీ పర్యాటకులకు తప్పిన ప్రమాదం..!!
- December 25, 2024
ఇస్తాంబుల్: టర్కీయేలో టూరిస్ట్ బస్సులో మంటలు చెలరేగిన ఘటనలో 35 మంది సౌదీ పర్యాటకుల బృందం తృటిలో తప్పించుకున్నారు. టర్కీ మీడియా ప్రకారం.. పర్యాటకులు సోమవారం సాయంత్రం గెబ్జే-ఓర్హంగజీ-ఇజ్మీర్ మోటర్వేలో బుర్సా నుండి ఇస్తాంబుల్కు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. 41 ఏళ్ల బస్సు డ్రైవర్ బస్సు జెమ్లిక్ బ్రిడ్జ్ దగ్గరకు చేరుకున్నప్పుడు ఇంజిన్ నుండి భారీగా పొగలు కమ్ముకోవడం గమనించాడు. మంటలు బస్సును చుట్టుముట్టకముందే ప్రయాణికులను బస్సు నుండి సురక్షితంగా దించివేశారు. దాంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. బస్సు డ్రైవర్ నుంచి సమాచారం అందుకున్న టర్కీ భద్రతా అధికారులు వెంటనే స్పందించారు. సంఘటనా స్థలానికి అగ్నిమాపక దళం మంటలను అదుపు చేసింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి టర్కీ భద్రతా అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం సౌదీ పర్యాటకులను మరో బస్సులో ఇస్తాంబుల్కు తరలించారు.
తాజా వార్తలు
- కువైట్లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!
- అంగోలాకు చేరుకున్న ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్..!!
- సౌదీలో ఎక్స్పాట్ డాక్టర్పై విచారణ..!!
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం







