ఒమన్ జియోలాజికల్ హెరిటేజ్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- December 31, 2024
ఒమన్: ఒమన్ జియోలాజికల్ హెరిటేజ్ ఎగ్జిబిషన్ నాల్గవ ఎడిషన్ దక్షిణ అల్ బతినా గవర్నరేట్లోని విలాయత్ ఆఫ్ అ'రుస్తాక్లోని అల్ హజ్మ్ ఫోర్ట్లో ప్రారంభమైంది. ఇది జూన్ 2025 చివరి వరకు కొనసాగుతుంది. సౌత్ అల్ బతినా గవర్నర్ కార్యాలయం, పెట్రోలియం డెవలప్మెంట్ ఒమన్, జియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఒమన్ సహకారంతో హెరిటేజ్ టూరిజం మంత్రిత్వ శాఖ ఈ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తుంది. వివిధ గవర్నరేట్లలో పర్యాటక, వారసత్వ గమ్యస్థానాల వివరాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
ఒమన్లో భౌగోళిక వారసత్వం, ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి, దానిని సంరక్షించడానికి హెరిటేజ్ టూరిజం మంత్రిత్వ శాఖ అమలు చేసిన ప్రయత్నాలను సౌత్ అల్ బతినా గవర్నర్ మసౌద్ సెయిడ్ అల్ హషిమి అభినందించారు
ప్రదర్శనలో సుమారు 800 మిలియన్ సంవత్సరాల నాటి శిలాజం, అంతరించిపోయిన ఆదిమ ఏనుగు త్రీడి నమూనాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. వీటితోపాటు ఏసీబ్లోని విలాయత్లోని అల్ ఖౌద్లో గుర్తించిన అంతరించిపోయిన డైనోసార్ నమూనా, దాని శిలాజ ఎముకల అవశేషాలు, ఇతర ప్రత్యేకమైన భౌగోళిక శిలాజాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







