ఇద్దరు తెలుగు క్రీడాకారులకు అర్జున అవార్డులు
- January 02, 2025
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.దేశం తరఫున వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలతో పాటు అర్జున అవార్డులను కూడా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఇందులో భాగంగా ఇద్దరు తేజాలు ఎంపిక అయ్యారు.వారిలో అథ్లెటిక్స్ విభాగంలో యర్రాజి జ్యోతి, పారా అథ్లెటిక్స్ నుంచి తెలంగాణకు చెందిన జివాంజి దీప్తిలు అర్జున అవార్డుకు ఎన్నికయ్యారు. కాగా జివాంజి దీప్తి పారాలంపిక్స్లో మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించింది. ఇదిలా ఉంటే ఈ ఇద్దరికి కేంద్రం అర్జున అవార్డులు ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈనెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ క్రీడా అవార్డులను ప్రదానం చేయనున్నారు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







