శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అర్జున్, దిల్ రాజ్..
- January 07, 2025
సినీ నటుడు అల్లు అర్జున్ సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిని సందర్శించి, సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయనతో పాటు నిర్మాత దిల్ రాజు కూడా ఆసుపత్రికి వచ్చారు. రామ్ గోపాల్ పేట్ పోలీసులు ఆసుపత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.డిసెంబర్ 4న “పుష్ప 2” ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళా అభిమాని రేవతి మరణించింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ గత 35 రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.అల్లు అర్జున్, దిల్ రాజు కలిసి వైద్యులను కలిసి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రేవతి కుటుంబానికి రూ. 1 కోటి ఆర్థిక సహాయం అందించారు. డైరెక్టర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కూడా చెరో రూ. 50 లక్షలు సాయం చేశారు.
ఈ ఘటనపై తన బాధను వ్యక్తం చేసిన అల్లు అర్జున్, బాధిత కుటుంబాలకు ఎప్పటికీ తోడుగా ఉంటానని చెప్పారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్బంగా జరిగిన ప్రమాదం క్రితం నెల టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశమైంది.అల్లు అర్జున్, దిల్ రాజు కిమ్స్ ఆసుపత్రికి చేరుకోనుండడంతో రామ్ గోపాల్ పేట్ పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రి వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో అక్కడ శాంతి భద్రతలను పర్యవేక్షించారు.ఈ ఘటనపై అల్లు అర్జున్ స్పందించిన తీరుకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలబడడం, ఆర్థిక సహాయం చేయడం అల్లు అర్జున్ ఉదారతను తెలియజేస్తోంది. అల్లు అర్జున్ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.రేవతి కుటుంబానికి రూ.1 కోటి ఆర్థిక సాయం.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







