తొక్కిసలాటలో భక్తులు మృతి – సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి..రేపు తిరుపతికి ఏపీ సీఎం

- January 08, 2025 , by Maagulf
తొక్కిసలాటలో భక్తులు మృతి – సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి..రేపు తిరుపతికి ఏపీ సీఎం

తిరుపతి: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో నలుగురు భక్తులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. టోకెన్ల కోసం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు.

ఈ ఘటనలో గాయాలైన వారికి అందుతున్న చికిత్సపై అధికారులతో సీఎం ఫోన్లో మాట్లాడారు. జిల్లా, టీటీడీ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని తెలుసుకున్నారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు.

రేపు ఉదయం తిరుపతికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తొక్కిసలాట ఘటనలో గాయపడి.. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com