అన్ని ఆహార పదార్థాలకు న్యూట్రిషనల్ లేబులింగ్ 'తప్పనిసరి'..!!
- January 09, 2025
మనామా: దేశీయంగా ఉత్పత్తి అయిన, దిగుమతి చేసుకున్న అన్ని ఆహార ఉత్పత్తులకు పోషకాహార లేబులింగ్ తప్పనిసరి అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. షురా కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ బస్సామ్ ఇస్మాయిల్ అల్ బిన్మొహమ్మద్ ఈ మేరకు తెలిపారు. మంత్రిత్వ శాఖ తన పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ ద్వారా ఈ నిబంధనలను అమలు చేయడంలో కృషి చేస్తుందన్నారు. క్యాలరీలు సహా ఇతర కీలక వివరాలతో సహా అన్ని ఆహార ఉత్పత్తులు పోషకాహార సమాచారాన్ని స్పష్టంగా ప్రదర్శించేలా చూసేందుకు సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆమోదించబడిన GCC సాంకేతిక లక్షణాలు మరియు నిబంధనలపై ఆధారపడి ఉంటుందని వివరించారు. వివరాలు అరబిక్, ఇంగ్లీషు రెండింటిలోనూ తప్పనిసరిగా పోషకాహార డేటా ఉండాలని సూచించారు. ఆహార నియంత్రణ విభాగం ఇన్స్పెక్టర్లు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోషకాహార లేబుల్స్ లేని ఉత్పత్తులను విక్రయించడానికి లేదా దిగుమతి చేసుకోవడానికి అనుమతి లేదని గుర్తుచేశారు.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









