అన్ని ఆహార పదార్థాలకు న్యూట్రిషనల్ లేబులింగ్ 'తప్పనిసరి'..!!
- January 09, 2025
మనామా: దేశీయంగా ఉత్పత్తి అయిన, దిగుమతి చేసుకున్న అన్ని ఆహార ఉత్పత్తులకు పోషకాహార లేబులింగ్ తప్పనిసరి అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. షురా కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ బస్సామ్ ఇస్మాయిల్ అల్ బిన్మొహమ్మద్ ఈ మేరకు తెలిపారు. మంత్రిత్వ శాఖ తన పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ ద్వారా ఈ నిబంధనలను అమలు చేయడంలో కృషి చేస్తుందన్నారు. క్యాలరీలు సహా ఇతర కీలక వివరాలతో సహా అన్ని ఆహార ఉత్పత్తులు పోషకాహార సమాచారాన్ని స్పష్టంగా ప్రదర్శించేలా చూసేందుకు సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆమోదించబడిన GCC సాంకేతిక లక్షణాలు మరియు నిబంధనలపై ఆధారపడి ఉంటుందని వివరించారు. వివరాలు అరబిక్, ఇంగ్లీషు రెండింటిలోనూ తప్పనిసరిగా పోషకాహార డేటా ఉండాలని సూచించారు. ఆహార నియంత్రణ విభాగం ఇన్స్పెక్టర్లు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోషకాహార లేబుల్స్ లేని ఉత్పత్తులను విక్రయించడానికి లేదా దిగుమతి చేసుకోవడానికి అనుమతి లేదని గుర్తుచేశారు.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







