ఇస్లామీయ ఆర్ధిక రాజధానిగా రూపొందనున్న దుబాయ్
- July 09, 2015
ఈ బుధవారం జరిగిన దుబాయ్ మ్యానేజ్ మెంట్ సెంటర్ ఫర్ ద ఇస్లామిక్ ఎకానమీ బోర్డ్ సమావేశానికి యు. ఏ. ఈ. ఉపాధ్యక్షులు మరియు దుబాయ్ అధినేత హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ అద్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ఇస్లామిక్ బాండ్ మార్కెట్లో (సుకుక్) నెంబర్ 1 గా ఎదగాలనే సుస్థిర లక్ష్యంతో 2 సంవత్సరాల క్రితం ప్రారంభమైన వ్యూహం యొక్క మొదటి దశ లక్ష్యాలను నిర్దేశిత తేదీకంటే ముందుగానే సాధించామని అన్నారు. రెండు సంవత్సరాల క్రితం దుబాయ్ని ఇస్లాం వాణిజ్య రాజధానిని చేయాలనే ఆలోచనను వ్యక్తం చేసినపుడు కొందరు సోదరులు సందేహ పడ్డారని, ఇప్పుడు మనం ప్రపంచంలో అతిపెద్ద బంద్ ప్లాట్ ఫార్మ్ గా ఉన్నామని, ఇదే స్థిరచిత్తoతో 2020నాటి లక్ష్యసాధనకు ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దుబాయ్ యువరాజు షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కూడా హాజరయ్యారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







