ఇస్లామీయ ఆర్ధిక రాజధానిగా రూపొందనున్న దుబాయ్
- July 09, 2015
ఈ బుధవారం జరిగిన దుబాయ్ మ్యానేజ్ మెంట్ సెంటర్ ఫర్ ద ఇస్లామిక్ ఎకానమీ బోర్డ్ సమావేశానికి యు. ఏ. ఈ. ఉపాధ్యక్షులు మరియు దుబాయ్ అధినేత హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ అద్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ఇస్లామిక్ బాండ్ మార్కెట్లో (సుకుక్) నెంబర్ 1 గా ఎదగాలనే సుస్థిర లక్ష్యంతో 2 సంవత్సరాల క్రితం ప్రారంభమైన వ్యూహం యొక్క మొదటి దశ లక్ష్యాలను నిర్దేశిత తేదీకంటే ముందుగానే సాధించామని అన్నారు. రెండు సంవత్సరాల క్రితం దుబాయ్ని ఇస్లాం వాణిజ్య రాజధానిని చేయాలనే ఆలోచనను వ్యక్తం చేసినపుడు కొందరు సోదరులు సందేహ పడ్డారని, ఇప్పుడు మనం ప్రపంచంలో అతిపెద్ద బంద్ ప్లాట్ ఫార్మ్ గా ఉన్నామని, ఇదే స్థిరచిత్తoతో 2020నాటి లక్ష్యసాధనకు ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దుబాయ్ యువరాజు షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కూడా హాజరయ్యారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







