గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు షాక్.. టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు!
- January 09, 2025
సంక్రాంతికి రానున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ మూవీలకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. సినిమాలకు విడుదలకు సంబంధించి టికెట్ల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. కేవలం 10 రోజుల వరకు మాత్రమే టికెట్ ధరలను పెంచుకునేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. సినిమా టికెట్ ధరలను 14 రోజులు పెంచుతూ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ పిల్ దాఖలైంది. దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు టికెట్ల ధరల పెంపును 10 రోజులకు పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సంక్రాంతి సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహరాజ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ రెండు సినిమాలపై కూడా అదే స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే సినిమాల టికెట్లకు సంబంధించి ధరలను పెంచాలని సినీనిర్మాతలు ఏపీ సర్కార్ను కోరారు. అయితే, ప్రభుత్వం టికెట్ ధరలను పెంపునకు అనుమతించింది.
10 రోజులకు పరిమితం చేస్తూ ఆదేశాలు:
టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం ఇచ్చిన అనుమతులపై వ్యతిరికేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే హైకోర్టు సినిమా టికెట్ల ధరల పెంపును 10 రోజులకు పరిమితం చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో సినిమాల కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని సినీవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణ ప్రేక్షకులు కోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తంచేస్తున్నారు.
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ మూవీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అలియాభట్ జంటగా నటించారు. ఈ మూవీలో దర్శకుడు ఎస్ జే సూర్య విలన్గా నటించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కానుంది.
ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ మూవీలో నట సింహం నందమూరి బాలకృష్ణ నటించగా, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కానుంది. ఈ మూవీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!









