బహ్రెయిన్ ప్రభుత్వ రంగంలో ప్రవాస ఉద్యోగుల డెటా ఔట్.!!
- January 09, 2025
మనామా: బహ్రెయిన్ ప్రభుత్వ రంగ వర్క్ ఫోర్స్ శక్తిలో బహ్రెయిన్లు సింహభాగంలో ఉన్నారని, 35,663 మంది ఉద్యోగులతో 86 శాతంగా ఉన్నారని, విదేశీయులు 14 శాతం లేదా 5,800 మంది వ్యక్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని సివిల్ సర్వీస్ బ్యూరో వెల్లడించింది. ప్రవాస కార్మికులలో ఎక్కువ మంది ఆరోగ్య సంరక్షణ, విద్యలో ఉన్నారు. 2019 నుండి విదేశీ కార్మికుల సంఖ్య 23 శాతం తగ్గింది. వారి సంఖ్య 7,582 నుండి 5,800కి పడిపోయింది.
విదేశీ ఉద్యోగుల నియామకం, కాంట్రాక్టులను పునరుద్ధరించడం అర్హత కలిగిన బహ్రెయిన్లు అందుబాటులో లేనప్పుడు మాత్రమే జరుగుతుందని బ్యూరో వివరించింది. ఏదైనా పునరుద్ధరణపై సంతకం చేసే ముందు, తగిన బహ్రెయిన్ అభ్యర్థులు లేరని నిర్ధారించాకనే ఖాళీలను భర్తీకి ప్రభుత్వ సంస్థలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు.
షురా కౌన్సిల్ లెజిస్లేటివ్, లీగల్ అఫైర్స్ కమిటీ విదేశీయులను నియమించుకోవడంపై కఠినమైన ఆంక్షలు విధించే లక్ష్యంతో సివిల్ సర్వీస్ చట్టంలో ప్రతిపాదిత మార్పును తిరస్కరించాలని పిలుపునిచ్చింది. పార్లమెంటు ముందుగా ఆమోదించిన సవరణ, షూరా కౌన్సిల్ తదుపరి సెషన్లో చర్చకు రానుంది. బహ్రెయిన్లు ఎవరూ అవసరాలను తీర్చకపోతే మాత్రమే విదేశీ నియామకాలను అనుమతిస్తారు. నాన్-బహ్రైన్ అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలని, పదేళ్ల అనుభవం కలిగి ఉండాలని, రెండేళ్లకు పరిమితమైన కాంట్రాక్టులపై పని చేయాలని, అసాధారణమైన సందర్భాల్లో మాత్రమే పునరుద్ధరణలు చేయాలని ఇది నిర్దేశిస్తుంది.
తాజా వార్తలు
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







