బహ్రెయిన్ ప్రభుత్వ రంగంలో ప్రవాస ఉద్యోగుల డెటా ఔట్.!!
- January 09, 2025
మనామా: బహ్రెయిన్ ప్రభుత్వ రంగ వర్క్ ఫోర్స్ శక్తిలో బహ్రెయిన్లు సింహభాగంలో ఉన్నారని, 35,663 మంది ఉద్యోగులతో 86 శాతంగా ఉన్నారని, విదేశీయులు 14 శాతం లేదా 5,800 మంది వ్యక్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని సివిల్ సర్వీస్ బ్యూరో వెల్లడించింది. ప్రవాస కార్మికులలో ఎక్కువ మంది ఆరోగ్య సంరక్షణ, విద్యలో ఉన్నారు. 2019 నుండి విదేశీ కార్మికుల సంఖ్య 23 శాతం తగ్గింది. వారి సంఖ్య 7,582 నుండి 5,800కి పడిపోయింది.
విదేశీ ఉద్యోగుల నియామకం, కాంట్రాక్టులను పునరుద్ధరించడం అర్హత కలిగిన బహ్రెయిన్లు అందుబాటులో లేనప్పుడు మాత్రమే జరుగుతుందని బ్యూరో వివరించింది. ఏదైనా పునరుద్ధరణపై సంతకం చేసే ముందు, తగిన బహ్రెయిన్ అభ్యర్థులు లేరని నిర్ధారించాకనే ఖాళీలను భర్తీకి ప్రభుత్వ సంస్థలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు.
షురా కౌన్సిల్ లెజిస్లేటివ్, లీగల్ అఫైర్స్ కమిటీ విదేశీయులను నియమించుకోవడంపై కఠినమైన ఆంక్షలు విధించే లక్ష్యంతో సివిల్ సర్వీస్ చట్టంలో ప్రతిపాదిత మార్పును తిరస్కరించాలని పిలుపునిచ్చింది. పార్లమెంటు ముందుగా ఆమోదించిన సవరణ, షూరా కౌన్సిల్ తదుపరి సెషన్లో చర్చకు రానుంది. బహ్రెయిన్లు ఎవరూ అవసరాలను తీర్చకపోతే మాత్రమే విదేశీ నియామకాలను అనుమతిస్తారు. నాన్-బహ్రైన్ అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలని, పదేళ్ల అనుభవం కలిగి ఉండాలని, రెండేళ్లకు పరిమితమైన కాంట్రాక్టులపై పని చేయాలని, అసాధారణమైన సందర్భాల్లో మాత్రమే పునరుద్ధరణలు చేయాలని ఇది నిర్దేశిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









