వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం చేసుకున్న హరియాణా గవర్నర్
- January 10, 2025
తిరుమల: హరియాణా గవర్నర్ బండారు దత్తత్రేయ వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది.
దర్శన అనంతరం బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వ దినాన ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం చాలా సంతోషాన్నికలిగించిందని,ఆధ్యాత్మికంగా అనిపించిందని, మనస్సుకు శాంతిని కలిగించిందని పేర్కొన్నారు.
వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుందని, జీవితం ధన్యమవుతుందని భావిస్తారని భక్తులందరు ఎంతో భక్తి తో, ఆత్రుతతో స్వామి వారి దర్శనానికి వస్తారని దత్తాత్రేయ అన్నారు.ఈ పర్వదినానికి ఒక రోజు ముందు స్వామి దర్శన టిక్కెట్ల కోసం ఆశతో వచ్చిన ఆరుగురు భక్తులు మరణించిన విషాదకర సంఘటన తనకు బాధ కలిగించిందని,ఇది మానవ తప్పిదమేనని అభిప్రాయపడ్డారు.అధికారులు మరియు ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భక్తుల నమ్మకాన్ని కాపాడాలని కోరుతున్నట్లు తెలిపారు.
మన దేశంలో భారతీయ సాంస్కృతీ సాంప్రదాయాలు, ఆచారాలు అన్నింటినీ కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని, ఇది పాతతరం వారు కొనసాగిస్తున్నప్పటికీ కొత్త తరం వారు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని దత్తాత్రేయ పిలుపునిచ్చారు.ఈ సాంస్కృతీ సాంప్రదాయాలు సరైన విధంగా బోధపడాల్సిందని, వాటి కోసమే మాతృభాషలోనే విద్యా బోధన చేస్తేనే సరైన అవగాహన కలుగుతుందని అభిప్రాయపడ్డారు. రామాయణ, మహా భారత, భాగవతం, పురాణాలు, వేమన శతకం, సుమతి శతకం, వేదాలు వంటి నీతి శాస్త్రాలు అధ్యయనం కావాలంటే దేవభాష ఐన సంస్కృతమే ప్రధానమని, ఇది అందరికీ సులభం కాదు కనుక మాతృభాషలోనే వాటి సారాంశం గ్రహించకలుగుతాయని, అందుకనే జాతీయ విద్య విధానం 2020 లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధమిక, మాధ్యమిక బోధనలలో మన మాతృబాషలోనే బోధించాలని, మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కృషిచేస్తున్నారని దత్తాత్రేయ గుర్తుచేశారు.తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ మాతృభాషలో విద్యాబోధనకు చొరవ తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీకి మరింత శక్తిని కల్పించి,వారు సంకల్పించిన 2047 లో వికసిత్ భారత్ విజయవంతం కావాలని భగవంతుణ్ణి ప్రార్దించినట్లు బండారు దత్తాత్రేయ తెలియజేసారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









