షాప్ ఆక్రమణదారుడికి కోర్టు షాక్..BD 25,000 చెల్లించాలని తీర్పు..!!
- January 10, 2025
మనామా: 2015 నుండి 2022 వరకు ఏడేళ్ల కాలానికి సంబంధించి మునిసిపల్ ఫీజు కింద BD 25,000 చెల్లించాలని ఉన్నత అడ్మినిస్ట్రేటివ్ కోర్టు ఒక దుకాణ యజమానిని ఆదేశించింది. రాజధానిలో కీలక ప్రాంతంలో ఉన్న దుకాణాన్ని ఆక్రమించిన కంపెనీకి వ్యతిరేకంగా క్యాపిటల్ మున్సిపాలిటీ దావా వేసింది. పదేపదే నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ మొత్తం BD 25,000 మునిసిపల్ ఫీజును చెల్లించడంలో కంపెనీ విఫలమైందని మున్సిపాలిటీ పేర్కొంది. బాకీ ఉన్న ఫీజులతో పాటు కోర్టు ఖర్చులను చెల్లించాలని కోర్టును కోరింది. న్యాయస్థానం సివిల్, కమర్షియల్ ఎవిడెన్స్ చట్టాన్ని ఉదహరిస్తూ.. నోటీసులు అందజేసిన దుకాణందారుడు కోర్టుకు హాజరుకావడం లేదా ఏదైనా రక్షణను సమర్పించడంలో విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. సమర్పించిన సాక్ష్యం, క్లెయిమ్ను వ్యతిరేకించడంలో ఫాసు ఆక్రమణదారుడు విఫలమైనందున, మునిసిపాలిటీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. BD 25,000 లతోపాటు కోర్టు ఖర్చులను చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్







