మసీదుల ముందు సరిగా పార్క్ చేయాలి
- June 29, 2016
మసీదులు ముందు తమ తమ వాహనాలను సరిగా పార్కింగ్ చేయాలని దుబాయ్ పోలీసులు వాహనదారులను కోరారు. దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ డైరెక్టర్ కల్నల్ సైఫ్ ముహార్ అల్ మజ్రౌయి మాట్లాడుతూ , మసీదులు ముందు సరిగ్గా పార్క్ చేయాలని వాహనదారులకు పిలుపునిచ్చారు. అలాగే రహదారి మధ్యలో వారి కార్లును నిలిపి ఉంచడం వలన అస్తవ్యస్త పార్కింగ్ మరియు రాత్రి సమయంలో ఇతర వాహనదారుల మార్గంను నిరోధించడం ద్వారా మసీదులు చుట్టూ గందరగోళం సృష్టించడం సరికాదని ఆయన వివరించారు. .అస్తవ్యస్త ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించడానికి మసీదుల చుట్టూ గస్తీని తీవ్రతరం చేస్తున్నామని అదేవిధంగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినవారిపై జరిమానాలు విధిస్తున్నట్లు కల్నల్ అల్ మజ్రౌయి చెప్పారు . మసీదులు సమీపంలో అక్రమ పార్కింగుల కారణంగా దుబాయ్ లో అన్ని రోడ్లపై ట్రాఫిక్ గందరగోళం, రద్దీ ఏర్పడటానికి కారణమవుతుంది అని ఆయన తెలిపారు. ఈ తరహా పార్కింగుల కారణంగా పౌర రక్షణ శాఖ మరియు అంబులెన్సులకు పని కల్పిస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారి గూర్చి వివరాలు, అలాగే ట్రాఫిక్ నిబంధనల్ని ఖాతరు చేయనివారి వ్యవహారం గూర్చి " మనం అంతా...పోలీసులమే ( వుయ్ ఆర్ ఆల్ పోలీస్') అనే కార్యక్రమం కింద 800-4353 ఫోన్ నంబర్ కు ప్రజలు పిర్యాదు చేయవచ్చని ఆయన కోరారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







