భారత రూపాయి ఇంకా పతనమవుతుందా? లాభమా..నష్టమా?
- January 13, 2025
యూఏఈ: ఈ సంవత్సరం భారత రూపాయి యూఏఈ దిర్హామ్కు 26 కంటే తక్కువగా పడిపోవచ్చు లేదా డాలర్కు 90కి చేరవచ్చు. ఇటీవలి వారాల్లో రూపాయి రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇది ఒక దిర్హామ్కు 23.689 లేదా యూఎస్ డాలర్కి 85.97 కు చేరింది. RBI తన కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలో కరెన్సీపై తన గట్టి పట్టును సడలించాడని మార్కెట్లో వార్తలు చక్కర్లు కొడుతుంది. ఈ ఊహాగానాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో రూపాయి విలువ మరింత పతనం అవుతుందని భావిస్తున్నారు
జనవరి 10న బ్లూమ్బెర్గ్ డేటా ప్రకారం.. డాలర్తో పోలిస్తే రూపాయి 86.04 వద్ద రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరుకుని 85.9728 వద్ద ముగిసింది. నిరంతర విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FII) ఉత్సాహం, చమురు దిగుమతిదారుల నుండి బలమైన డాలర్ డిమాండ్, బ్రెంట్ క్రూడ్ ధరలలో పెరుగుదల, యూఎస్ ట్రెజరీ ఈల్డ్లు పెరగడం ఇవన్నీ కరెన్సీ క్షీణతకు దోహదపడ్డాయి. ఈ తరుగుదల ఇండియా దిగుమతి-భారీ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా అధిక చమురు ధరలకు దారితీసే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో బలహీనమైన రూపాయి వాణిజ్య ఎగుమతుల వృద్ధికి సహాయపడుతుందని, దేశ ఎగుమతి ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని గవేకల్ రీసెర్చ్ విశ్లేషకులు ఉదిత్ సికంద్, టామ్ మిల్లర్ తెలిపారు. కాగా, ప్రస్తుతం రూపాయి విలువ తగ్గడం కారణంగా ఆర్బీఐ వద్ద విదేశీ మారకనిల్వలు సుమారు $70 బిలియన్లు పడిపోయాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీకి దక్కిన అరుదైన గౌరవం
- ఆంధ్ర భవన్లో ఘనంగా నిర్వహించిన ఆత్మ గౌరవ దివస్–2026
- IPL 2026: ఫైనల్లో గుజరాత్ 155 రన్స్..ఆర్సీబీ కొట్టాల్సింది 156
- వైజాగ్లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్
- 6,500 మంది అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ మెగా వీడియో కాన్ఫరెన్స్
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్కు విశిష్ట గుర్తింపు
- గూగుల్కు రూ.30 లక్షల జరిమానా..హైకోర్టు కీలక తీర్పు
- యాత్రికులకు 25 లక్షలకు పైగా వైద్యసేవలు అందజేత..!!









