భారత రూపాయి ఇంకా పతనమవుతుందా? లాభమా..నష్టమా?
- January 13, 2025
యూఏఈ: ఈ సంవత్సరం భారత రూపాయి యూఏఈ దిర్హామ్కు 26 కంటే తక్కువగా పడిపోవచ్చు లేదా డాలర్కు 90కి చేరవచ్చు. ఇటీవలి వారాల్లో రూపాయి రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇది ఒక దిర్హామ్కు 23.689 లేదా యూఎస్ డాలర్కి 85.97 కు చేరింది. RBI తన కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలో కరెన్సీపై తన గట్టి పట్టును సడలించాడని మార్కెట్లో వార్తలు చక్కర్లు కొడుతుంది. ఈ ఊహాగానాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో రూపాయి విలువ మరింత పతనం అవుతుందని భావిస్తున్నారు
జనవరి 10న బ్లూమ్బెర్గ్ డేటా ప్రకారం.. డాలర్తో పోలిస్తే రూపాయి 86.04 వద్ద రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరుకుని 85.9728 వద్ద ముగిసింది. నిరంతర విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FII) ఉత్సాహం, చమురు దిగుమతిదారుల నుండి బలమైన డాలర్ డిమాండ్, బ్రెంట్ క్రూడ్ ధరలలో పెరుగుదల, యూఎస్ ట్రెజరీ ఈల్డ్లు పెరగడం ఇవన్నీ కరెన్సీ క్షీణతకు దోహదపడ్డాయి. ఈ తరుగుదల ఇండియా దిగుమతి-భారీ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా అధిక చమురు ధరలకు దారితీసే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో బలహీనమైన రూపాయి వాణిజ్య ఎగుమతుల వృద్ధికి సహాయపడుతుందని, దేశ ఎగుమతి ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని గవేకల్ రీసెర్చ్ విశ్లేషకులు ఉదిత్ సికంద్, టామ్ మిల్లర్ తెలిపారు. కాగా, ప్రస్తుతం రూపాయి విలువ తగ్గడం కారణంగా ఆర్బీఐ వద్ద విదేశీ మారకనిల్వలు సుమారు $70 బిలియన్లు పడిపోయాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







