WPL షెడ్యూల్ రిలీజ్..
- January 17, 2025
ఐపీఎల్ కంటే ముందే క్రికెట్ లవర్స్కు వినోదం పంచేందుకు డబ్ల్యూపీఎల్ (Women's Premier League) సిద్ధం కానుంది. 2025 మహిళల ప్రీమియర్ లీగ్కు సంబంధించిన షెడ్యూల్ రిలీజైంది. ఫిబ్రవరి 14న ఈ టోర్నీ ప్రారంభం కానుంది. మార్చి 15న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఓపెనింగ్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్తో ఢీ కొట్టనుంది.
ఈ టోర్నీకి నాలుగు నగరాలు వేదిక కానున్నాయి. ముంబయి, బెంగళూరు, వడోదర, లఖ్నవూ స్టేడియాల్లో మొత్తం 22 మ్యాచ్లు జరగనున్నాయి. అత్యధికంగా బెంగళూరు 8 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఫైనల్ మ్యాచ్కు ముంబయి వేదిక కానుంది. అన్ని మ్యాచ్లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి.
కాగా, ఫిబ్రవరి 14న మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. ఈ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్కు సంబంధించిన సెలబ్రిటీలు ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొని సందడి చేయనున్నారు. టైటిల్ కోసం మొత్తం 5 జట్లు టోర్నమెంట్లో పోటీపడనున్నాయి.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









