5 రోజుల్లో మహాకుంభమేళాకు 7 కోట్ల మందికి పైగా భక్తులు..!!
- January 17, 2025
ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో చేరుతున్నారు. గంగా, యమునా, సర్స్వతి నదుల సంగమ ప్రదేశంలో పుణ్యస్నానం చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా అంతర్జాతీయంగా కూడా భక్తులు తరలివస్తున్నారు. ఈ మహా మేళాలో గత ఐదు రోజుల్లో 7 కోట్ల మందికి పైగా భక్తులు చేరుకోవడం విశేషం. ప్రతి సంవత్సరం ఈ మేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొనడం అనేది భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీకగా మారింది.
ఈ మేళాలో ప్రత్యేకంగా ఆకర్షణ నిలిచిన వ్యక్తి రష్యన్ సాధువు. ఆయన ఎనిమిది అడుగుల ఎత్తుతో ఉండడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన తన కెరీర్ను వదిలేసి, పండితత్వంలో దశాబ్దాలుగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయనను పలువురు భక్తులు “పరశురాముడిగా” పిలుస్తున్నారు. ఆయన యోగా, ధ్యానం ద్వారా సాధించిన ఉత్తేజం భక్తులను మంత్రముగ్దులను చేస్తోంది. ఈ మహాకుంభమేళా వేద కాలం నుంచి సాగుతున్న గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రాచుర్యం పొందింది. ఈ కార్యక్రమంలో ప్రతి భక్తుడి హాజరై, పుణ్యస్నానం చేసి తమ ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







