5 రోజుల్లో మహాకుంభమేళాకు 7 కోట్ల మందికి పైగా భక్తులు..!!
- January 17, 2025
ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో చేరుతున్నారు. గంగా, యమునా, సర్స్వతి నదుల సంగమ ప్రదేశంలో పుణ్యస్నానం చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా అంతర్జాతీయంగా కూడా భక్తులు తరలివస్తున్నారు. ఈ మహా మేళాలో గత ఐదు రోజుల్లో 7 కోట్ల మందికి పైగా భక్తులు చేరుకోవడం విశేషం. ప్రతి సంవత్సరం ఈ మేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొనడం అనేది భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీకగా మారింది.
ఈ మేళాలో ప్రత్యేకంగా ఆకర్షణ నిలిచిన వ్యక్తి రష్యన్ సాధువు. ఆయన ఎనిమిది అడుగుల ఎత్తుతో ఉండడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన తన కెరీర్ను వదిలేసి, పండితత్వంలో దశాబ్దాలుగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయనను పలువురు భక్తులు “పరశురాముడిగా” పిలుస్తున్నారు. ఆయన యోగా, ధ్యానం ద్వారా సాధించిన ఉత్తేజం భక్తులను మంత్రముగ్దులను చేస్తోంది. ఈ మహాకుంభమేళా వేద కాలం నుంచి సాగుతున్న గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రాచుర్యం పొందింది. ఈ కార్యక్రమంలో ప్రతి భక్తుడి హాజరై, పుణ్యస్నానం చేసి తమ ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









