5 రోజుల్లో మహాకుంభమేళాకు 7 కోట్ల మందికి పైగా భక్తులు..!!
- January 17, 2025
ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో చేరుతున్నారు. గంగా, యమునా, సర్స్వతి నదుల సంగమ ప్రదేశంలో పుణ్యస్నానం చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా అంతర్జాతీయంగా కూడా భక్తులు తరలివస్తున్నారు. ఈ మహా మేళాలో గత ఐదు రోజుల్లో 7 కోట్ల మందికి పైగా భక్తులు చేరుకోవడం విశేషం. ప్రతి సంవత్సరం ఈ మేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొనడం అనేది భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీకగా మారింది.
ఈ మేళాలో ప్రత్యేకంగా ఆకర్షణ నిలిచిన వ్యక్తి రష్యన్ సాధువు. ఆయన ఎనిమిది అడుగుల ఎత్తుతో ఉండడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన తన కెరీర్ను వదిలేసి, పండితత్వంలో దశాబ్దాలుగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయనను పలువురు భక్తులు “పరశురాముడిగా” పిలుస్తున్నారు. ఆయన యోగా, ధ్యానం ద్వారా సాధించిన ఉత్తేజం భక్తులను మంత్రముగ్దులను చేస్తోంది. ఈ మహాకుంభమేళా వేద కాలం నుంచి సాగుతున్న గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రాచుర్యం పొందింది. ఈ కార్యక్రమంలో ప్రతి భక్తుడి హాజరై, పుణ్యస్నానం చేసి తమ ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!