5 రోజుల్లో మహాకుంభమేళాకు 7 కోట్ల మందికి పైగా భక్తులు..!!
- January 17, 2025
ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో చేరుతున్నారు. గంగా, యమునా, సర్స్వతి నదుల సంగమ ప్రదేశంలో పుణ్యస్నానం చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా అంతర్జాతీయంగా కూడా భక్తులు తరలివస్తున్నారు. ఈ మహా మేళాలో గత ఐదు రోజుల్లో 7 కోట్ల మందికి పైగా భక్తులు చేరుకోవడం విశేషం. ప్రతి సంవత్సరం ఈ మేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొనడం అనేది భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీకగా మారింది.
ఈ మేళాలో ప్రత్యేకంగా ఆకర్షణ నిలిచిన వ్యక్తి రష్యన్ సాధువు. ఆయన ఎనిమిది అడుగుల ఎత్తుతో ఉండడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన తన కెరీర్ను వదిలేసి, పండితత్వంలో దశాబ్దాలుగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయనను పలువురు భక్తులు “పరశురాముడిగా” పిలుస్తున్నారు. ఆయన యోగా, ధ్యానం ద్వారా సాధించిన ఉత్తేజం భక్తులను మంత్రముగ్దులను చేస్తోంది. ఈ మహాకుంభమేళా వేద కాలం నుంచి సాగుతున్న గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రాచుర్యం పొందింది. ఈ కార్యక్రమంలో ప్రతి భక్తుడి హాజరై, పుణ్యస్నానం చేసి తమ ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







