5 రోజుల్లో మహాకుంభమేళాకు 7 కోట్ల మందికి పైగా భక్తులు..!!
- January 17, 2025
ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో చేరుతున్నారు. గంగా, యమునా, సర్స్వతి నదుల సంగమ ప్రదేశంలో పుణ్యస్నానం చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా అంతర్జాతీయంగా కూడా భక్తులు తరలివస్తున్నారు. ఈ మహా మేళాలో గత ఐదు రోజుల్లో 7 కోట్ల మందికి పైగా భక్తులు చేరుకోవడం విశేషం. ప్రతి సంవత్సరం ఈ మేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొనడం అనేది భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీకగా మారింది.
ఈ మేళాలో ప్రత్యేకంగా ఆకర్షణ నిలిచిన వ్యక్తి రష్యన్ సాధువు. ఆయన ఎనిమిది అడుగుల ఎత్తుతో ఉండడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన తన కెరీర్ను వదిలేసి, పండితత్వంలో దశాబ్దాలుగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయనను పలువురు భక్తులు “పరశురాముడిగా” పిలుస్తున్నారు. ఆయన యోగా, ధ్యానం ద్వారా సాధించిన ఉత్తేజం భక్తులను మంత్రముగ్దులను చేస్తోంది. ఈ మహాకుంభమేళా వేద కాలం నుంచి సాగుతున్న గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రాచుర్యం పొందింది. ఈ కార్యక్రమంలో ప్రతి భక్తుడి హాజరై, పుణ్యస్నానం చేసి తమ ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







