లైసెన్స్ లేని లోన్ ప్రొవైడర్స్.. బహ్రెయిన్ ఇండియన్ ఎంబసీ వార్నింగ్..!!
- January 17, 2025
మనామా: బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం కీలక వార్నింగ్ ను జారీ చేసింది. లైసెన్స్ లేని లోన్ ప్రొవైడర్స్ తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. బహ్రెయిన్లోని కార్మికుల బృందం అదే జాతీయత కలిగిన వ్యక్తులకు అధిక వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తూ అక్రమ బిజినెస్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ లోన్ ప్రొవైడర్స్ నేర కార్యకలాపాల నుండి వచ్చిన అక్రమ నిధులను ఉపయోగిస్తున్నారని నమ్ముతున్నట్లు ఎంబసీ పేర్కొంది. ఈ ఆందోళనల దృష్ట్యా, బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం లైసెన్స్ పొందిన ఆర్థిక సంస్థల వెలుపలి మూలాల నుండి రుణాలు తీసుకోకుండా ఉండమని కమ్యూనిటీ సభ్యులను కోరింది. ఇటువంటి అనధికార రుణాలు వ్యక్తులను చట్టపరమైన పరిణామాలకు గురిచేయవచ్చని రాయబార కార్యాలయం తెలిపింది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, చట్టబద్ధమైన మార్గాల ద్వారానే ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలని భారతీయ పౌరులకు సూచించింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







