లైసెన్స్ లేని లోన్ ప్రొవైడర్స్.. బహ్రెయిన్ ఇండియన్ ఎంబసీ వార్నింగ్..!!
- January 17, 2025
మనామా: బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం కీలక వార్నింగ్ ను జారీ చేసింది. లైసెన్స్ లేని లోన్ ప్రొవైడర్స్ తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. బహ్రెయిన్లోని కార్మికుల బృందం అదే జాతీయత కలిగిన వ్యక్తులకు అధిక వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తూ అక్రమ బిజినెస్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ లోన్ ప్రొవైడర్స్ నేర కార్యకలాపాల నుండి వచ్చిన అక్రమ నిధులను ఉపయోగిస్తున్నారని నమ్ముతున్నట్లు ఎంబసీ పేర్కొంది. ఈ ఆందోళనల దృష్ట్యా, బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం లైసెన్స్ పొందిన ఆర్థిక సంస్థల వెలుపలి మూలాల నుండి రుణాలు తీసుకోకుండా ఉండమని కమ్యూనిటీ సభ్యులను కోరింది. ఇటువంటి అనధికార రుణాలు వ్యక్తులను చట్టపరమైన పరిణామాలకు గురిచేయవచ్చని రాయబార కార్యాలయం తెలిపింది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, చట్టబద్ధమైన మార్గాల ద్వారానే ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలని భారతీయ పౌరులకు సూచించింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







