లైసెన్స్ లేని లోన్ ప్రొవైడర్స్.. బహ్రెయిన్ ఇండియన్ ఎంబసీ వార్నింగ్..!!
- January 17, 2025
మనామా: బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం కీలక వార్నింగ్ ను జారీ చేసింది. లైసెన్స్ లేని లోన్ ప్రొవైడర్స్ తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. బహ్రెయిన్లోని కార్మికుల బృందం అదే జాతీయత కలిగిన వ్యక్తులకు అధిక వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తూ అక్రమ బిజినెస్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ లోన్ ప్రొవైడర్స్ నేర కార్యకలాపాల నుండి వచ్చిన అక్రమ నిధులను ఉపయోగిస్తున్నారని నమ్ముతున్నట్లు ఎంబసీ పేర్కొంది. ఈ ఆందోళనల దృష్ట్యా, బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం లైసెన్స్ పొందిన ఆర్థిక సంస్థల వెలుపలి మూలాల నుండి రుణాలు తీసుకోకుండా ఉండమని కమ్యూనిటీ సభ్యులను కోరింది. ఇటువంటి అనధికార రుణాలు వ్యక్తులను చట్టపరమైన పరిణామాలకు గురిచేయవచ్చని రాయబార కార్యాలయం తెలిపింది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, చట్టబద్ధమైన మార్గాల ద్వారానే ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలని భారతీయ పౌరులకు సూచించింది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







