లైసెన్స్ లేని లోన్ ప్రొవైడర్స్.. బహ్రెయిన్ ఇండియన్ ఎంబసీ వార్నింగ్..!!
- January 17, 2025
మనామా: బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం కీలక వార్నింగ్ ను జారీ చేసింది. లైసెన్స్ లేని లోన్ ప్రొవైడర్స్ తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. బహ్రెయిన్లోని కార్మికుల బృందం అదే జాతీయత కలిగిన వ్యక్తులకు అధిక వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తూ అక్రమ బిజినెస్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ లోన్ ప్రొవైడర్స్ నేర కార్యకలాపాల నుండి వచ్చిన అక్రమ నిధులను ఉపయోగిస్తున్నారని నమ్ముతున్నట్లు ఎంబసీ పేర్కొంది. ఈ ఆందోళనల దృష్ట్యా, బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం లైసెన్స్ పొందిన ఆర్థిక సంస్థల వెలుపలి మూలాల నుండి రుణాలు తీసుకోకుండా ఉండమని కమ్యూనిటీ సభ్యులను కోరింది. ఇటువంటి అనధికార రుణాలు వ్యక్తులను చట్టపరమైన పరిణామాలకు గురిచేయవచ్చని రాయబార కార్యాలయం తెలిపింది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, చట్టబద్ధమైన మార్గాల ద్వారానే ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలని భారతీయ పౌరులకు సూచించింది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









