కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- January 17, 2025
కువైట్ సిటీ: "ఏట్నా అమెరికా" ఒప్పందానికి సంబంధించిన నష్టానికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మాజీ అధికారులు సంయుక్తంగా $88 మిలియన్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ సివిల్, కమర్షియల్ విభాగం తీర్పునిచ్చింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతివాదుల నుండి $88.5 మిలియన్ల (లేదా కువైట్ దినార్లకు సమానం) సామూహిక పరిహారాన్ని కోరింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మంత్రిత్వ శాఖ, ప్రజా నిధులకు ఆర్థిక, ప్రతిష్టకు నష్టం వాటిల్లిందని పేర్కొంది. వీటితోపాటు 5,001 కువైట్ దినార్ల తాత్కాలిక పౌర పరిహారం, కోర్టు ఖర్చులు, న్యాయవాది రుసుములను ప్రతివాదులు చెల్లించాలని తీర్పులో ఆదేశించారు. జనవరి 4, 2015న సంతకం చేసిన ఒప్పందంలో అంగీకరించిన కమీషన్ కు అనధికారికంగా అధికారులు 2.5% జోడించి, ఆ మేరకు నిధులను పక్కదారి పట్టించారు. దీంతో దీనిపై కేసు నమోదైంది. రాష్ట్ర నియంత్రణ అధికారుల అవగాహన లేదా ఆమోదం లేకుండా ఈ సర్దుబాటు చేశారని, ఫలితంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఆర్థికంగా నష్టం వాటిల్లిందని కోర్టు నిర్ధారించింది. ప్రభుత్వ నిధులను కాజేయడం, నియంత్రణ పరిధికి మించి అధికారులు నిర్ణయాలు తీసుకుని ఆర్థిక నష్టానికి కారణం అయ్యారని కోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









