కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- January 17, 2025
కువైట్ సిటీ: "ఏట్నా అమెరికా" ఒప్పందానికి సంబంధించిన నష్టానికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మాజీ అధికారులు సంయుక్తంగా $88 మిలియన్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ సివిల్, కమర్షియల్ విభాగం తీర్పునిచ్చింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతివాదుల నుండి $88.5 మిలియన్ల (లేదా కువైట్ దినార్లకు సమానం) సామూహిక పరిహారాన్ని కోరింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మంత్రిత్వ శాఖ, ప్రజా నిధులకు ఆర్థిక, ప్రతిష్టకు నష్టం వాటిల్లిందని పేర్కొంది. వీటితోపాటు 5,001 కువైట్ దినార్ల తాత్కాలిక పౌర పరిహారం, కోర్టు ఖర్చులు, న్యాయవాది రుసుములను ప్రతివాదులు చెల్లించాలని తీర్పులో ఆదేశించారు. జనవరి 4, 2015న సంతకం చేసిన ఒప్పందంలో అంగీకరించిన కమీషన్ కు అనధికారికంగా అధికారులు 2.5% జోడించి, ఆ మేరకు నిధులను పక్కదారి పట్టించారు. దీంతో దీనిపై కేసు నమోదైంది. రాష్ట్ర నియంత్రణ అధికారుల అవగాహన లేదా ఆమోదం లేకుండా ఈ సర్దుబాటు చేశారని, ఫలితంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఆర్థికంగా నష్టం వాటిల్లిందని కోర్టు నిర్ధారించింది. ప్రభుత్వ నిధులను కాజేయడం, నియంత్రణ పరిధికి మించి అధికారులు నిర్ణయాలు తీసుకుని ఆర్థిక నష్టానికి కారణం అయ్యారని కోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!