కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- January 17, 2025
కువైట్ సిటీ: "ఏట్నా అమెరికా" ఒప్పందానికి సంబంధించిన నష్టానికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మాజీ అధికారులు సంయుక్తంగా $88 మిలియన్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ సివిల్, కమర్షియల్ విభాగం తీర్పునిచ్చింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతివాదుల నుండి $88.5 మిలియన్ల (లేదా కువైట్ దినార్లకు సమానం) సామూహిక పరిహారాన్ని కోరింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మంత్రిత్వ శాఖ, ప్రజా నిధులకు ఆర్థిక, ప్రతిష్టకు నష్టం వాటిల్లిందని పేర్కొంది. వీటితోపాటు 5,001 కువైట్ దినార్ల తాత్కాలిక పౌర పరిహారం, కోర్టు ఖర్చులు, న్యాయవాది రుసుములను ప్రతివాదులు చెల్లించాలని తీర్పులో ఆదేశించారు. జనవరి 4, 2015న సంతకం చేసిన ఒప్పందంలో అంగీకరించిన కమీషన్ కు అనధికారికంగా అధికారులు 2.5% జోడించి, ఆ మేరకు నిధులను పక్కదారి పట్టించారు. దీంతో దీనిపై కేసు నమోదైంది. రాష్ట్ర నియంత్రణ అధికారుల అవగాహన లేదా ఆమోదం లేకుండా ఈ సర్దుబాటు చేశారని, ఫలితంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఆర్థికంగా నష్టం వాటిల్లిందని కోర్టు నిర్ధారించింది. ప్రభుత్వ నిధులను కాజేయడం, నియంత్రణ పరిధికి మించి అధికారులు నిర్ణయాలు తీసుకుని ఆర్థిక నష్టానికి కారణం అయ్యారని కోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









