కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- January 17, 2025
కువైట్ సిటీ: "ఏట్నా అమెరికా" ఒప్పందానికి సంబంధించిన నష్టానికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మాజీ అధికారులు సంయుక్తంగా $88 మిలియన్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ సివిల్, కమర్షియల్ విభాగం తీర్పునిచ్చింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతివాదుల నుండి $88.5 మిలియన్ల (లేదా కువైట్ దినార్లకు సమానం) సామూహిక పరిహారాన్ని కోరింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మంత్రిత్వ శాఖ, ప్రజా నిధులకు ఆర్థిక, ప్రతిష్టకు నష్టం వాటిల్లిందని పేర్కొంది. వీటితోపాటు 5,001 కువైట్ దినార్ల తాత్కాలిక పౌర పరిహారం, కోర్టు ఖర్చులు, న్యాయవాది రుసుములను ప్రతివాదులు చెల్లించాలని తీర్పులో ఆదేశించారు. జనవరి 4, 2015న సంతకం చేసిన ఒప్పందంలో అంగీకరించిన కమీషన్ కు అనధికారికంగా అధికారులు 2.5% జోడించి, ఆ మేరకు నిధులను పక్కదారి పట్టించారు. దీంతో దీనిపై కేసు నమోదైంది. రాష్ట్ర నియంత్రణ అధికారుల అవగాహన లేదా ఆమోదం లేకుండా ఈ సర్దుబాటు చేశారని, ఫలితంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఆర్థికంగా నష్టం వాటిల్లిందని కోర్టు నిర్ధారించింది. ప్రభుత్వ నిధులను కాజేయడం, నియంత్రణ పరిధికి మించి అధికారులు నిర్ణయాలు తీసుకుని ఆర్థిక నష్టానికి కారణం అయ్యారని కోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







