కొచ్చి డైలాగ్ 2025: ఇండియా- GCC మధ్య బలమైన సంబంధాలు..!!
- January 18, 2025
మనామా: కొచ్చి డైలాగ్ 2025 ఎడిషన్ సందర్భంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) –ఇండియా తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచనుంది. దీనిని భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) సహకారంతో సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ (CPPR) నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో GCC సెక్రటరీ జనరల్ H.E. జాసెమ్ మొహమ్మద్ అల్-బుదైవి ప్రత్యేకంగా ప్రసంగించారు. కేరళలో జరగనున్న ఇండియా-GCC సంబంధాలపై దృష్టి సారించే మొట్టమొదటి ట్రాక్ 1.5 డైలాగ్గా, కొచ్చి డైలాగ్ 2025 వ్యాపార నాయకులు, ఇతర వాటాదారులకు ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు. ‘ఇండియాస్ లుక్ వెస్ట్ పాలసీ ఇన్ యాక్షన్: పీపుల్, ప్రోస్పెరిటీ అండ్ ప్రోగ్రెస్’ అనే థీమ్పై ఆయన మాట్లాడారు. ఇండియా-జిసిసి సంబంధాలను బలోపేతం చేయడానికి కార్యాచరణ వ్యూహాలను అన్వేషించడానికి ప్రయత్నిస్తుందన్నారు. కొచ్చి డైలాగ్ 2025 ద్వారా ఇండియా- GCC మధ్య సంపన్నమైన మరియు శాశ్వతమైన భాగస్వామ్యానికి పునాదులను పటిష్టం చేయాలని ఈవెంట్ లో ప్రసంగించిన వక్తలు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కేసులో మిస్టరీని ఛేదించిన హైదరాబాద్ పోలీస్
- రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు!
- మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్..ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి
- రోడ్ల విషయమై మంత్రి గడ్కరి ని కలిసిన ఎంపీ బాల శౌరి
- దుబాయ్ లో ది లూప్ ప్రాజెక్ట్..ఎలోన్ మస్క్ తో ఒప్పందం..!!
- కువైట్లో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు..!!
- ఎడారి ప్రాంతాల్లో ఉల్లంఘనలపై కేసులు నమోదు..తనిఖీలు ప్రారంభం..!!
- రియాద్ వేదికగా డిసెంబర్లో గ్లోబల్ ఎయిర్పోర్ట్స్ ఫోరమ్..!!
- ఘోర ప్రమాదం..గ్యాస్ పేలుడుతో కుప్పకూలిన భవనం..!!
- ఫిబ్రవరి 16న మస్కట్లో హిందూ మహాసముద్ర సదస్సు..!!