కొచ్చి డైలాగ్ 2025: ఇండియా- GCC మధ్య బలమైన సంబంధాలు..!!
- January 18, 2025
మనామా: కొచ్చి డైలాగ్ 2025 ఎడిషన్ సందర్భంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) –ఇండియా తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచనుంది. దీనిని భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) సహకారంతో సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ (CPPR) నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో GCC సెక్రటరీ జనరల్ H.E. జాసెమ్ మొహమ్మద్ అల్-బుదైవి ప్రత్యేకంగా ప్రసంగించారు. కేరళలో జరగనున్న ఇండియా-GCC సంబంధాలపై దృష్టి సారించే మొట్టమొదటి ట్రాక్ 1.5 డైలాగ్గా, కొచ్చి డైలాగ్ 2025 వ్యాపార నాయకులు, ఇతర వాటాదారులకు ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు. ‘ఇండియాస్ లుక్ వెస్ట్ పాలసీ ఇన్ యాక్షన్: పీపుల్, ప్రోస్పెరిటీ అండ్ ప్రోగ్రెస్’ అనే థీమ్పై ఆయన మాట్లాడారు. ఇండియా-జిసిసి సంబంధాలను బలోపేతం చేయడానికి కార్యాచరణ వ్యూహాలను అన్వేషించడానికి ప్రయత్నిస్తుందన్నారు. కొచ్చి డైలాగ్ 2025 ద్వారా ఇండియా- GCC మధ్య సంపన్నమైన మరియు శాశ్వతమైన భాగస్వామ్యానికి పునాదులను పటిష్టం చేయాలని ఈవెంట్ లో ప్రసంగించిన వక్తలు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







