ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- January 18, 2025
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక పాత్ర వహిస్తుంది. ఉగ్రవాద గ్రూపులు, వారి మద్దతుదారులపై పోరాటం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు, సమాజాల భద్రతకు పొంచివున్న ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి అన్ని అంతర్జాతీయ ప్రయత్నాలనకు యూఏఈ మద్దతుగా నిలుస్తుంది. పెరుగుతున్న తీవ్రవాద ముప్పు గురించి హెచ్చరించిన మొదటి దేశాలలో యూఏఈ ముందువరుసలో ఉంది. దానిని ఎదుర్కోవడానికి, నిర్మూలించడానికి ప్రాంతీయ, ప్రపంచ సహకారాన్ని కోరారు. ఇది ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలకు మద్దతుగా ఉంటుంది.
యెమెన్లో చట్టబద్ధ పాలనను పునరుద్ధరించడానికి సంకీర్ణంలో యూఏఈ ముఖ్యమైన పాత్ర పోషించింది. మార్చి 2015లో ప్రారంభించబడిన ఆపరేషన్ డెసిసివ్ స్టార్మ్లో యాక్టివ్ మెంబర్ గా ఉంది. యెమెన్పై ఆధిపత్యం చెలాయించే హౌతీ తీవ్రవాద మిలీషియాల ప్రణాళికలను అడ్డుకోవడంలో యూఏఈ సాయుధ దళాలు కీలక పాత్ర పోషించాయి. గల్ఫ్ ఆఫ్ అడెన్, బాబ్ అల్ మాండెబ్ జలసంధిపై నియంత్రణ ద్వారా పొరుగు దేశాలను, అంతర్జాతీయ సముద్ర నావిగేషన్ను బెదిరించేందుకు వాడుకున్నారు. హౌతీలను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు యూఏఈ దళాలు యెమెన్లోని అల్ ఖైదా, డేష్లకు తీవ్ర నష్టం చేశాయి. తదనంతరకాలంలో అనేక నగరాలు, వారి నియంత్రణ నుండి విముక్తి పొందడంలో యూఏఈ పాత్ర వెలకట్టలేనిదని ప్రకటించారు. తీవ్రవాదం, మతోన్మాదానికి ప్రత్యామ్నాయంగా శాంతిని నెలకొల్లేందుకు ప్రాంతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. వీటిలో జూలై 2015లో సావాబ్ సెంటర్ను ఏర్పాటు చేయడం, డేష్ను ఓడించేందుకు గ్లోబల్ కోయలిషన్కు మద్దతిచ్చే ఇంటరాక్టివ్ ఆన్లైన్ మెసేజింగ్ సర్వీస్ ను ప్రారంభించారు. జూలై 2014లో యూఏఈ అబుదాబిలో ముస్లిం కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్ను ప్రారంభించింది. ఇస్లామిక్ ప్రపంచంలో శాంతిని పెంపొందించే లక్ష్యంతో మొదటి స్వతంత్ర అంతర్జాతీయ సంస్థగా ఇది అవతరించింది. డిసెంబరు 2012లో యూఏఈ హిదయ్ - ది ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కౌంటర్ ఎక్స్ట్రీమిజం, హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రారంభించింది. తద్వారా వ్యక్తులలో రాడికల్ భావజాలాన్ని లేదా హింసాత్మక తీవ్రవాదంలో చేరకుండా నిరోధించడానికి ఈ కేంద్రం ప్రపంచ భాగస్వాములతో కలిసి పనిచేస్తుంది.
తాజా వార్తలు
- ఇరాన్తో తాత్కాలిక ఒప్పందం పొడిగింపుపై ఆసక్తి లేదు: ట్రంప్
- డిగ్రీ విద్యార్థులకు ఎస్బీఐ ప్రత్యేక స్కాలర్షిప్
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా NATS వినూత్న కార్యక్రమం
- వికసిత భారత్ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర–పూర్వ ఉపరాష్ట్రపతి పిలుపు
- దుబాయ్ ఎయిర్పోర్టులో ఉబర్, కరీమ్ ప్రయాణికుల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్
- తెలంగాణలో సర్ ముసాయిదా విడుదల..
- తమిళనాడులో విజయ్ 100రోజుల పాలన పూర్తి..
- 2026 తొలి ఆరు నెలల్లో షేక్ జాయెద్ గ్రాండ్ మసీదుకు 31.27 లక్షల మంది సందర్శకులు
- జెడ్డాలో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్తో ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ భేటీ







