గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- January 18, 2025
విజయవాడ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయవాడ గన్నవరం ఏర్పోర్టుకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు.. కూటమి నేతలు స్వాగతం పలికారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి అమిత్ షా వెళ్లనున్నారు.ఈ రోజు రాత్రి చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు. చంద్రబాబు నివాసంలో జరిగే విందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, పలువురు సీనియర్ నేతలు హాజరుకానున్నారు.
చంద్రబాబు నివాసంలో విందు సమావేశం అనంతరం అమిత్ షా ఈ రాత్రి విజయవాడలోని నోవాటెల్ హోటల్లో బస చేయనున్నారు.రేపు (జనవరి 19న) ఏపీలో జరిగే ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు అమిత్ షా హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









