గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- January 18, 2025
విజయవాడ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయవాడ గన్నవరం ఏర్పోర్టుకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు.. కూటమి నేతలు స్వాగతం పలికారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి అమిత్ షా వెళ్లనున్నారు.ఈ రోజు రాత్రి చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు. చంద్రబాబు నివాసంలో జరిగే విందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, పలువురు సీనియర్ నేతలు హాజరుకానున్నారు.
చంద్రబాబు నివాసంలో విందు సమావేశం అనంతరం అమిత్ షా ఈ రాత్రి విజయవాడలోని నోవాటెల్ హోటల్లో బస చేయనున్నారు.రేపు (జనవరి 19న) ఏపీలో జరిగే ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు అమిత్ షా హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..









