గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- January 18, 2025
విజయవాడ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయవాడ గన్నవరం ఏర్పోర్టుకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు.. కూటమి నేతలు స్వాగతం పలికారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి అమిత్ షా వెళ్లనున్నారు.ఈ రోజు రాత్రి చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు. చంద్రబాబు నివాసంలో జరిగే విందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, పలువురు సీనియర్ నేతలు హాజరుకానున్నారు.
చంద్రబాబు నివాసంలో విందు సమావేశం అనంతరం అమిత్ షా ఈ రాత్రి విజయవాడలోని నోవాటెల్ హోటల్లో బస చేయనున్నారు.రేపు (జనవరి 19న) ఏపీలో జరిగే ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు అమిత్ షా హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు
- పవర్ఫుల్ పాస్పోర్టుల జాబితా విడుదల
- మార్చి 1 నుంచి లైసెన్స్ లేనివారి పై కఠిన చర్యలు
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డిల సేవలు చిరస్మరణీయం: మంత్రి దుర్గేష్









