వైట్ టీ షర్ట్ ఉద్యమాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ
- January 19, 2025
న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ వైట్ టీ షర్ట్ ఉద్యమాన్ని ప్రారంభించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదలకు సాయం చేయడం లేదని, సామాన్య ప్రజల హక్కుల కోసం పోరాడడానికి ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాహుల్ గాంధీ ఆదివారం ప్రకటించారు.
ఈ మేరకు ఓ వీడియోను కూడా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ప్రజలకు ఆర్థిక న్యాయంపై నమ్మకం ఉంటే, పెరుగుతున్న సంపద అసమానతలను వ్యతిరేకించాలని అన్నారు. సామాజిక సమానత్వం కోసం పోరాడాలని చెప్పారు. అన్ని రకాల వివక్షలను వ్యతిరేకించాలని తెలిపారు.
భారత్లో శాంతి, స్థిరత్వం కోసం పోరాడాలని కోరారు. తెల్ల టీ షర్టులు ధరించి ఉద్యమంలో పాల్గొనండని చెప్పారు. మోదీ ప్రభుత్వం పేదలు, శ్రామిక వర్గాలను పట్టించుకోవడం లేదని అన్నారు. వారిని వారి ఇష్టానికే వదిలేసిందని విమర్శించారు. కొంతమంది పెట్టుబడిదారులను మరింత సంపన్నం చేయడంపైనే ప్రభుత్వ దృష్టి ఉందని రాహుల్ గాంధీ చెప్పారు.
దీంతో దేశంలో అసమానతలు నిరంతరం పెరుగుతున్నాయని చెప్పారు.తమ రక్తం, చెమటతో దేశాన్ని పోషించే కార్మికుల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని తెలిపారు. ఎన్నో రకాల అన్యాయాలు, దౌర్జన్యాలను రుచిచూడాల్సి వస్తోందని చెప్పారు.
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







