వైట్ టీ షర్ట్ ఉద్యమాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ
- January 19, 2025
న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ వైట్ టీ షర్ట్ ఉద్యమాన్ని ప్రారంభించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదలకు సాయం చేయడం లేదని, సామాన్య ప్రజల హక్కుల కోసం పోరాడడానికి ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాహుల్ గాంధీ ఆదివారం ప్రకటించారు.
ఈ మేరకు ఓ వీడియోను కూడా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ప్రజలకు ఆర్థిక న్యాయంపై నమ్మకం ఉంటే, పెరుగుతున్న సంపద అసమానతలను వ్యతిరేకించాలని అన్నారు. సామాజిక సమానత్వం కోసం పోరాడాలని చెప్పారు. అన్ని రకాల వివక్షలను వ్యతిరేకించాలని తెలిపారు.
భారత్లో శాంతి, స్థిరత్వం కోసం పోరాడాలని కోరారు. తెల్ల టీ షర్టులు ధరించి ఉద్యమంలో పాల్గొనండని చెప్పారు. మోదీ ప్రభుత్వం పేదలు, శ్రామిక వర్గాలను పట్టించుకోవడం లేదని అన్నారు. వారిని వారి ఇష్టానికే వదిలేసిందని విమర్శించారు. కొంతమంది పెట్టుబడిదారులను మరింత సంపన్నం చేయడంపైనే ప్రభుత్వ దృష్టి ఉందని రాహుల్ గాంధీ చెప్పారు.
దీంతో దేశంలో అసమానతలు నిరంతరం పెరుగుతున్నాయని చెప్పారు.తమ రక్తం, చెమటతో దేశాన్ని పోషించే కార్మికుల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని తెలిపారు. ఎన్నో రకాల అన్యాయాలు, దౌర్జన్యాలను రుచిచూడాల్సి వస్తోందని చెప్పారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









