భారత్ లో మొదటి ఎయిర్ ట్యాక్సీ ఆవిష్కరణ
- January 20, 2025
మహానగరంలో ట్రాఫిక్ సమస్యలు రానురాను ఎక్కువ అవుతున్నాయి. ఈ సమస్యలను పరిస్కహరించేలా అడుగులు పడేలా లేవు. దీనితో ‘ఎయిర్ ట్యాక్సీ’ల దృష్టిని సారించింది. ఇండియాలో మొట్టమొదటి ఎయిర్ట్యాక్సీ నమూనాను ఓ స్టార్టప్ కంపెనీ తాజాగా ప్రదర్శించింది. బెంగళూరు వంటి మహా నగరాల్లో జనాలు ‘ఎయిర్ ట్యాక్సీ’ ఎక్కే రోజులు ఎంతో దూరంలో లేవు! రోడ్డుమీద ఓ ఆటో లేదా ఓ ట్యాక్సీ ఎక్కినట్టుగా..‘ఎయిర్ ట్యాక్సీ’ ఎక్కి, గాలిలో ప్రయాణించే సదుపాయం రాబోతున్నది.
హైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాల్లో జనాలు ‘ఎయిర్ ట్యాక్సీ’ ఎక్కే రోజులు ఎంతో దూరంలో లేవు! ఇండియాలో మొట్టమొదటి ఎయిర్ట్యాక్సీ నమూనాను ఓ స్టార్టప్ కంపెనీ తాజాగా ప్రదర్శించింది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ఎయిర్ ట్యాక్సీ ‘శూన్య’ను బెంగళూరుకు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ సర్లా ఏవియేషన్ ఆవిష్కరించింది.
ఎయిర్ ట్యాక్సీ సేవలను 2028నాటికి బెంగళూరు నగర పరిధిలో ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది. ‘శూన్య’ ఎయిర్ ట్యాక్సీ గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 20 నుంచి 30 కిలోమీటర్ల స్వల్ప దూరంలో రాకపోకలు సాగించేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. దీంట్లో గరిష్ఠంగా ఆరుగురు ప్రయాణించవచ్చునని, మహా నగరాల పరిధిలో ప్రజల అత్యవసర వైద్య సేవల కోసం ఉచిత ఎయిర్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నామని కంపెనీ చెప్పింది.
తాజా వార్తలు
- మెట్రోలో ఫోన్పే మ్యాజిక్
- మిడిల్ ఈస్ట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!









