33 ఆర్థిక మోసాలకు పాల్పడిన 9 మంది సభ్యుల ముఠా అరెస్ట్..!!

- January 21, 2025 , by Maagulf
33 ఆర్థిక మోసాలకు పాల్పడిన 9 మంది సభ్యుల ముఠా అరెస్ట్..!!

రియాద్: 33 ఆర్థిక మోసాలకు పాల్పడిన 9 మంది సభ్యుల ముఠాను రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠా సభ్యుల్లో ముగ్గురు సౌదీ పౌరులు, ఆరుగురు బంగ్లాదేశ్ పౌరులు ఉన్నారు. రియాద్ పోలీసుల కథనం ప్రకారం..  ప్రభుత్వ సేవలను అందజేస్తామని ముఠా సభ్యులు బాధితులను మోసం చేసేవారని పేర్కొన్నారు.  ఈ ముఠా వివిధ ప్రభుత్వ సేవలను అందిస్తామనే నెపంతో బాధితులను మోసం చేసి సుమారు SR394000 మోసం చేసిందని పోలీసులు తెలిపారు. నిందితుల నుండి నేరానికి ఉపయోగించిన అన్ని ఉపకరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులపై చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com