ఆంధ్రాకు భారీ ప్రాజెక్ట్: చంద్రబాబు ట్వీట్
- January 21, 2025
దావోస్లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. రెండ రోజు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో చంద్రబాబు వరుస సమావేశాలు జరిగాయి. వివిధ సంస్థల ప్రతినిధులతో 15కు పైగా సమావేశాల్లో చంద్రబాబు ముఖాముఖి భేటీలు నిర్వహించారు. గ్రీన్ హైడ్రోజన్ – గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీ సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలకు చంద్రబాబు హాజరుకానున్నారు. సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యూఏఈ ఎకానమీ మినిస్టర్తోనూ భేటీ అవుతారు.
వెల్స్పన్ చైర్మన్ బీకే గోయింకా, ఎల్జీ కెమ్ సీఈవో షిన్ హక్ చియోల్, కార్ల్స్బెర్గ్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, వాల్మార్ట్ ప్రెసిడెంట్-సీఈవో కాత్ మెక్లే, సిస్కో సీఈవో చుక్ రాబిన్స్, కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ తదితరులతో పెట్టుబడులపై చర్చించనున్నారు.
దావోస్లో మిట్టల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ సమావేశమయ్యారు. ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేయడానికి ఇప్పటికే అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే అంశంపై ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది.
అనకాపల్లిలో 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో ఆర్సెలార్ మిత్తల్, జపాన్కు చెందిన నిప్పాన్ స్టీల్ జేవీ సంయుక్తంగా గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్ట్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన విషయాన్ని లక్ష్మీమిత్తల్ గుర్తు చేశారు. ఆర్సెలార్ మిత్తల్, నిప్పాన్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో ఏర్పాటు చేసేది అతిపెద్ద ప్రాజెక్టు అన్నారు. ఇది అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు.
Met with the Executive Chairman of @AMNSIndia, Mr. Lakshmi N. Mittal, and CEO Mr. Aditya Mittal, in Davos today. ArcelorMittal/Nippon Steel has recently made a landmark investment of ₹1.4 lakh crore for a 17.8-million-ton integrated steel project in Anakapalli. This initiative… pic.twitter.com/wjS6fEga2u
— N Chandrababu Naidu (@ncbn) January 21, 2025
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం