RAKలో 27 మిలియన్ దిర్హామ్లకు పైగా ఫేక్ కరెన్సీ సీజ్..!!
- January 22, 2025
యూఏఈ: యూఏఈలో నకిలీ విదేశీ కరెన్సీని కలిగి ఉన్న ముగ్గురు అరబ్ జాతీయులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి $7.5 మిలియన్లు (Dh27.5 మిలియన్లు)ను స్వాధీనం చేసుకున్నారు. రస్ అల్ ఖైమాలోని ఒక వ్యాపారవేత్త ఇద్దరు సహచరుల సహాయంతో నకిలీ కరెన్సీని చెలామణి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయమైన సమాచారం అందడంతో అధికారులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రస్ అల్ ఖైమా పోలీస్ జనరల్ కమాండ్, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ సెక్యూరిటీ, ఇంటీరియర్ మినిస్ట్రీలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి నకిలీ కరెన్సీ నమూనాలతోపాటు భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







