యూఏఈ పెవిలియన్ను సందర్శించిన హిస్ హైనెస్ ఇసా బిన్ సల్మాన్..!!
- January 22, 2025
మనామా: ఇసా బిన్ సల్మాన్ ఎడ్యుకేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీల బోర్డు ఛైర్మన్, లేబర్ ఫండ్ (తమ్కీన్) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ హిస్ హైనెస్ షేక్ ఇసా బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని సందర్శించారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) 55వ వార్షిక సమావేశంలో యూఏఈ పెవిలియన్ ను యూఏఈ క్యాబినెట్ వ్యవహారాల మంత్రి, HE మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ గెర్గావి, యూఏఈ ప్రతినిధి బృందం సభ్యులతో కలిసి సందర్శించారు. అనంతరం వారితో సమావేశం అయ్యారు. WEFలో ఉన్నత స్థాయి బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి హెచ్హెచ్ షేక్ ఇసా బిన్ సల్మాన్ నాయకత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హిస్ హైనెస్ షేక్ ఇసా బిన్ సల్మాన్.. బహ్రెయిన్ -యూఏఈ మధ్య ఉన్న బలమైన సంబంధాలను సమీక్షించారు. రాబోయే రోజుల్లో వివిధ రంగాల్లో సంబంధాలను పెంపొందించే మార్గాలను కూడా సమావేశంలో చర్చించారు. బహ్రెయిన్ ఆర్థిక మంత్రి, HE షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా, పలువురు సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







