దుబాయ్ లో టాక్సీ కంటే చౌకైనది.. బస్సు కంటే వేగవంతం..!!
- January 23, 2025
దుబాయ్: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రారంభించిన కొత్త బస్ పూలింగ్ సర్వీస్ నివాసితులలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రారంభించిన మొదటి 10 రోజుల్లోనే 500 మందికి పైగా ఈ సేవను ఉపయోగించుకున్నారని అధికార ప్రతినిధి తెలిపారు. కొందరు ప్రయాణికులు తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. కరామా నివాసి తారెక్ ప్రతిరోజూ బిజినెస్ బేలోని తన కార్యాలయానికి వెళ్లడానికి ఈ సర్వీస్ ను ఉపయోగిస్తున్నారు. "ఇది ఇది RTA బస్సు కంటే ఉత్తమం. ఎందుకంటే మీరు బస్ స్టాప్కు సమయానికి చేరుకోకపోతే, మీరు తదుపరి బస్సు కోసం వేచి ఉండాలి. అలాగే మధ్యలో చాలా స్టాప్లు ఉన్నాయి. ఈ సర్వీస్ నన్ను నా ఇంటి నుండి కార్యాలయానికి 15 నుండి 20 నిమిషాల్లో చేరవేస్తుంది. ఇది చాలా పొదుపుగా కూడా ఉంది." అని వివరించాడు. డిసెంబర్ 2024లో ప్రారంభించబడిన బస్ పూలింగ్ సర్వీస్, స్మార్ట్ యాప్లలో బుకింగ్ సిస్టమ్ ద్వారా ప్రయాణీకులు మినీబస్ రైడ్లను ఎంచుకోవచ్చు. స్థానికంగా, అంతర్జాతీయంగా ప్రజా రవాణా వ్యవస్థలలో ప్రత్యేకత కలిగిన మూడు కంపెనీల సహకారంతో ఈ ప్రాజెక్ట్ అమలు అవుతుంది. ఈ-హెయిల్ ట్యాక్సీ సేవల కంటే ఈ సర్వీస్ ధర దాదాపు 20 నుంచి 30 శాతం చౌకగా ఉంటుందని ఆర్టీఏ ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







