మనీ ఎక్స్ఛేంజ్లో సాయుధ దోపిడీ..24 గంటల్లో నైజీరియన్ ముఠా అరెస్ట్..!!
- January 23, 2025
కువైట్: మహ్బౌలా ప్రాంతంలో మనీ ఎక్స్ఛేంజ్లో సాయుధ దోపిడీకి పాల్పడిన నైజీరియన్ ముఠాను 24 గంటల్లో అరెస్ట్ చేసినట్టు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారి వద్ద నుండి 4600 దీనార్ల విలువైన విదేశీ కరెన్సీలను స్వాధీనం చేసుకున్నారు.చోరీ చేసిన వాహనాలను నిందితులు ఉపయోగించారని పేర్కొన్నారు.నిందితులలో ఒకరిని మహబూలా ప్రాంతంలో అరెస్ట్ చేయగా, ఇతర నిందితుతులను అల్-ఖురైన్ మార్కెట్స్ ప్రాంతంలో అరెస్టు చేశారు. అనంతరం వారి ఇంటి నుండి చోరీ చేసి నగదుతోపాటు మాదక ద్రవ్యం (షాబు)ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రాసిక్యూషన్ కార్యాలయానికి రెఫర్ చేశారు.
తాజా వార్తలు
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!







