జబల్ షామ్స్, అల్ జబల్ అల్ అఖ్దర్లో కొత్త పర్యాటక ప్రాజెక్టులు..!!
- January 23, 2025
మస్కట్: 2024లో రవాణా రంగంలో ప్రారంభించిన ప్రాజెక్టులలో 90% పూర్తి అయినట్టు రవాణా, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఖమీస్ మొహమ్మద్ అల్ షమ్మఖీ పేర్కొన్నారు. ఓడరేవుల రంగం విషయానికొస్తే, ఈ రంగం నుండి ప్రయోజనాలను పెంచుకోవడానికి, మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని అల్ షమ్మఖి తెలిపారు. జబల్ షామ్స్, అల్ జబల్ అల్ అఖ్దర్, అల్ జబల్ అల్ అబ్యాద్లలో అనేక పర్యాటక సంబంధిత ప్రాజెక్టుల అమలుపై మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తుందని తెలిపారు.
ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్ సెక్రటరీ అలీ అమెర్ అల్ షిధానీ మాట్లాడుతూ..ఎలక్ట్రానిక్ అథెంటికేషన్ సిస్టమ్ను అప్డేట్ చేయడం, అప్గ్రేడ్ చేయడంలో మంత్రిత్వ శాఖ పనిచేసిందని చెప్పారు. ప్రభుత్వ సేవల్లో ఏకీకరణ సాధించేందుకు డిజిటల్ పరివర్తన ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన ధృవీకరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సహకారంతో ఒమన్లో 4ఐఆర్ సెంటర్ను ఏర్పాటు చేయడం అంతర్జాతీయ నైపుణ్యం నుండి ప్రయోజనం పొందడం, అనుభవాలను ఇచ్చిపుచ్చుకోవడం లక్ష్యంగా ఉందని అల్ షిధానీ చెప్పారు. అంతర్జాతీయ ఫోరమ్లలో ఒమన్ తన ఉనికిని పెంపొందించడానికి ఈ కేంద్రం దోహదం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







