అమెరికాలో నాలుగేళ్లలో $600 బిలియన్ల పెట్టుబడి.. క్రౌన్ ప్రిన్స్
- January 23, 2025
రియాద్: క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్తో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. ఇరు దేశాల మధ్య సహకారం, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన కీలక రంగాలపై చర్చించారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. మధ్యప్రాచ్యంలో శాంతి, భద్రత మరియు సుస్థిరతను పెంపొందించే ప్రయత్నాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం ప్రాముఖ్యతను చెప్పారు. వాణిజ్యం , పెట్టుబడితో సహా వివిధ రంగాలలో సంబంధాలను పెంచుకోవడానికి మార్గాలపై సమీక్షించారు. సౌదీ అరేబియా యొక్క ప్రతిష్టాత్మక ప్రణాళికలను హైలైట్ చేశారు క్రౌన్ ప్రిన్స్. యునైటెడ్ స్టేట్స్లో రాబోయే నాలుగు సంవత్సరాల్లో $600 బిలియన్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల భాగస్వామ్య ప్రయోజనాలకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలపై సౌదీ అరేబియాతో కలిసి పనిచేయడానికి తన ఆసక్తిని ట్రంప్ వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







