అమెరికాలో నాలుగేళ్లలో $600 బిలియన్ల పెట్టుబడి.. క్రౌన్ ప్రిన్స్
- January 23, 2025
రియాద్: క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్తో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. ఇరు దేశాల మధ్య సహకారం, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన కీలక రంగాలపై చర్చించారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. మధ్యప్రాచ్యంలో శాంతి, భద్రత మరియు సుస్థిరతను పెంపొందించే ప్రయత్నాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం ప్రాముఖ్యతను చెప్పారు. వాణిజ్యం , పెట్టుబడితో సహా వివిధ రంగాలలో సంబంధాలను పెంచుకోవడానికి మార్గాలపై సమీక్షించారు. సౌదీ అరేబియా యొక్క ప్రతిష్టాత్మక ప్రణాళికలను హైలైట్ చేశారు క్రౌన్ ప్రిన్స్. యునైటెడ్ స్టేట్స్లో రాబోయే నాలుగు సంవత్సరాల్లో $600 బిలియన్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల భాగస్వామ్య ప్రయోజనాలకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలపై సౌదీ అరేబియాతో కలిసి పనిచేయడానికి తన ఆసక్తిని ట్రంప్ వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







