క్యాండీలు, కేక్లలో ఉపయోగించే ఎరుపు రంగు పై నిషేధం..!!
- January 24, 2025
యూఏఈ: కొన్ని మిఠాయిలు, స్నాక్స్, పండ్ల ఉత్పత్తులు, కేకులు, కొన్ని నోటి మందులకు చెర్రీ-ఎరుపు రంగును ఇచ్చే సింథటిక్ ఫుడ్ డై వాడకాన్ని అమెరికా బుధవారం నిషేధించిన తర్వాత, దీనిపై యూఏఈ అప్రమత్తమైంది. తాము కూడా సింథటిక్ ఫుడ్ డై వాడకాన్ని పర్యవెక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ రంగు ప్రయోగశాల ఎలుకలలో క్యాన్సర్కు కారణమవుతుందని రుజువు కావడంతో అమెరికా దాని వినియోగంపై నిషేధం విధించింది.
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆహార పదార్థాలలో రెడ్ నెం.3 రంగుపై నిషేధం విధించిన మూడు దశాబ్దాల తర్వాత అది సౌందర్య సాధనాల్లో ఉపయోగించదాన్ని నిషేధించారు. ఈ రంగు ప్రస్తుతం అమెరికాలో దాదాపు 3,000 ఆహార ఉత్పత్తులలో ఉపయోగిస్తున్నారు.
ఇక ఎమిరేట్స్ లో, దిగుమతి చేసుకున్న ఆహార ఉత్పత్తులు స్థానిక అధికారులతో సమన్వయంతో ఎంట్రీ పాయింట్ల వద్ద కఠినమైన తనిఖీలకు లోబడి ఉంటాయి. ఆహార ఉత్పత్తులు వినియోగానికి సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించడానికి క్రమం తప్పకుండా నమూనాలను పరీక్షించబడతాయి. అవి వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగించకుండా చూసేందుకు అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రమాణాల మేరకు నిబంధనలను నిర్దేశిస్తారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







