క్యాండీలు, కేక్లలో ఉపయోగించే ఎరుపు రంగు పై నిషేధం..!!
- January 24, 2025
యూఏఈ: కొన్ని మిఠాయిలు, స్నాక్స్, పండ్ల ఉత్పత్తులు, కేకులు, కొన్ని నోటి మందులకు చెర్రీ-ఎరుపు రంగును ఇచ్చే సింథటిక్ ఫుడ్ డై వాడకాన్ని అమెరికా బుధవారం నిషేధించిన తర్వాత, దీనిపై యూఏఈ అప్రమత్తమైంది. తాము కూడా సింథటిక్ ఫుడ్ డై వాడకాన్ని పర్యవెక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ రంగు ప్రయోగశాల ఎలుకలలో క్యాన్సర్కు కారణమవుతుందని రుజువు కావడంతో అమెరికా దాని వినియోగంపై నిషేధం విధించింది.
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆహార పదార్థాలలో రెడ్ నెం.3 రంగుపై నిషేధం విధించిన మూడు దశాబ్దాల తర్వాత అది సౌందర్య సాధనాల్లో ఉపయోగించదాన్ని నిషేధించారు. ఈ రంగు ప్రస్తుతం అమెరికాలో దాదాపు 3,000 ఆహార ఉత్పత్తులలో ఉపయోగిస్తున్నారు.
ఇక ఎమిరేట్స్ లో, దిగుమతి చేసుకున్న ఆహార ఉత్పత్తులు స్థానిక అధికారులతో సమన్వయంతో ఎంట్రీ పాయింట్ల వద్ద కఠినమైన తనిఖీలకు లోబడి ఉంటాయి. ఆహార ఉత్పత్తులు వినియోగానికి సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించడానికి క్రమం తప్పకుండా నమూనాలను పరీక్షించబడతాయి. అవి వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగించకుండా చూసేందుకు అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రమాణాల మేరకు నిబంధనలను నిర్దేశిస్తారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









