హైదరాబాద్: యువ గాయకులతో హుషారు పాటలు
- January 24, 2025
హైదరాబాద్: హైదరాబాద్లో శ్రీ రాగ భైరవి సంస్థ నిర్వహణలో శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై యువ గాయనీ గాయకులు నేటి సినిమా పాటలను పాడి శ్రోతలకు హుషారు కలిగించారు.విఖ్యాత గాయకుడు డాక్టర్ ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం సహా గాయణులతో కలసి పాడిన పాటలను యువ గాయకులు ఉత్సాహంగా పాడి చలి వాతావరణంలో వేడి పుట్టించారు.కామేష్ మాంధా,చంద్ర మౌళి,మనోజ్ భరత్ రాము దిలావర్ ఇందు నయన అనుపమ ఆనంది చంద్రిక స్వప్న తదితరులు పాటల విందు చేశారు.అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు పాల్గొని మాట్లాడుతూ...బాలసుబ్రహ్మణ్యం తో తమ సంస్థకు వున్న అనుబంధం గుర్తు చేసుకున్నారు గాన సభ కు బాలు ఎన్నోసార్లు వచ్చారని గుర్తు చేసుకున్నారు.ఘంటసాల తరువాత అంతటి కీర్తి సంపాదించుకున్న నేపథ్య గాయకుడు బాలు అన్నారు శ్రీ రాగభైరవి సంస్థలో పాడిన యువ గాయని గాయకులకు మంచి భవిష్యత్ వుంటుందని కామేష్ నిర్వహణలో అరుదుగా కనిపించే గాయనీ గాయకులు పాలు పంచుకొవటం విశేషం అన్నారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







