మోటార్ సైకిలిస్టులపై 13,700 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- January 25, 2025
మనామా: గత నాలుగేళ్లలో మోటార్సైకిలిస్టులపై 13,725 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయని, అదే సమయంలో తీవ్రమైన ఉల్లంఘనల కారణంగా 346 మోటార్సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ట్రాఫిక్ ఉల్లంఘనలను, ప్రత్యేకించి ఆహారం, ఇతర ఆర్డర్ల వంటి డెలివరీ సేవలకు ఉపయోగించే మోటార్సైకిళ్లను ఖచ్చితంగా పర్యవేక్షణ ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు సమర్పించిన నివేదికలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ నమోదు చేసిన ఉల్లంఘనలపై మంత్రిత్వ శాఖ గణాంకాలను అందించింది. 2020లో 2,378 ఉల్లంఘనలు , 2021లో 3,227, 2022లో 3,932.. నవంబర్ 21, 2023 నాటికి నమోదైన ఉల్లంఘనల సంఖ్య 4,188కి పెరిగిందని తెలిపింది. ఉల్లంఘనలను పరిష్కరించడానికి ట్రాఫిక్ చట్టం ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ చర్యలు అమలు చేసినేట్టు అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. "రైడ్ సేఫ్" ప్రచారంలో భాగంగా ట్రాఫిక్ చట్టాలను పాటించడాన్ని ప్రోత్సహించడానికి, ప్రమాదాలను తగ్గించడానికి రూపొందించినట్టు తెలిపారు. డెలివరీ కంపెనీల సహకారంతో మంత్రిత్వ శాఖ 2023లో 30కి పైగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది.
తాజా వార్తలు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!







