జెనిన్పై ఇజ్రాయెల్ దాడి..తీవ్రంగా ఖండించిన ఒమన్..!!
- January 25, 2025
మస్కట్: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో జెనిన్పై ఇటీవల ఇజ్రాయెల్ దాడి చేసి అమాయక పౌరుల మరణానికి దారితీసింది. అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆస్తికి విస్తృతంగా నష్టం కలిగించడాన్ని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. కొనసాగుతున్న దాడులను ఆపడానికి తక్షణ చర్య తీసుకోవాలని, అంతర్జాతీయ చట్టపరమైన , మానవతా చట్టం ప్రకారం ఇజ్రాయెల్ ను బాధ్యులను చేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. ఆక్రమిత భూభాగాల్లో పాలస్తీనా ప్రజల బాధలను తుదముట్టించి న్యాయాన్ని స్థాపించాల్సిన తక్షణ అవసరం ఉందని తెలిపింది. ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, అరబ్ పీస్ ఇనిషియేటివ్ ఆధారంగా న్యాయమైన, శాశ్వతమైన శాంతిని సాధించడానికి ఒమన్ తన స్థిరమైన నిబద్ధతను కొనసాగిస్తుందని పునరుద్ఘాటించింది. యుద్ధం వల్ల ప్రభావితమైన పౌరుల హక్కులు, జీవితాలను రక్షించడానికి అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







