0.7 శాతం పెరిగిన ఒమన్ ద్రవ్యోల్బణం..!!
- January 26, 2025
మస్కట్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ (NCSI) జారీ చేసిన సుల్తానేట్లోని వినియోగదారుల ధరల సూచిక (CPI) నుండి వచ్చిన డేటా ప్రకారం.. ఒమన్ లో ద్రవ్యోల్బణం రేటు 2023 (ప్రాథమిక సంవత్సరం 2018) అదే నెలతో పోలిస్తే 2024 డిసెంబర్లో 0.7 శాతం పెరిగింది. వివిధ వ్యక్తిగత వస్తువులు, సేవల గ్రూప్ ధరలు 4.5 శాతం, ఆరోగ్య గ్రూప్ 3.2 శాతం, ఆహారం, మద్యపాన రహిత పానీయాల గ్రూప్ 1.7 శాతం, రెస్టారెంట్లు,హోటళ్ల గ్రూప్ 0.8, వినోద గ్రూప్ 0.6 శాతం, దుస్తులు, పాదరక్షల గ్రూప్ 0.5 శాతం, ఫర్నిచర్, గృహోపకరణాలు నిర్వహణ గ్రూప్ 0.4 శాతం, విద్యా గ్రూప్ రా 0.1 శాతం పెరుగుదలను డేటా సూచించింది. మరోవైపు, రవాణా గ్రూప్ ధరలు 0.8 శాతం తగ్గాయి.అయితే హౌసింగ్, నీరు, విద్యుత్, గ్యాస్, కమ్యూనికేషన్లు, పొగాకు, ఇతర ఇంధనాల గ్రూపుల ధరలు స్థిరంగా ఉన్నాయి.
కూరగాయల గ్రూపు ధరలు 7.6 శాతం పెరిగాయి. పాలు, చీజ్, గుడ్ల గ్రూప్ కూడా 3.8 శాతం పెరిగింది. ఆహార ఉత్పత్తుల గ్రూప్ 3.7 శాతం, చక్కెర, జామ్, తేనె , స్వీట్ల గ్రూప్ 2.8 శాతం, మాంసం గ్రూప్ 2.6 శాతం, పండ్ల గ్రూప్ 2.2 శాతం, నూనెలు, కొవ్వుల గ్రూప్ 1.6 శాతం పెరిగాయి. అదే సమయంలో ధాన్యాల గ్రూప్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే మద్యపాన రహిత పానీయాల గ్రూప్ ధరలు 0.5 శాతం తగ్గాయి. చేపలు, మత్స్య గ్రూప్ ధరలు కూడా 6.3 శాతం తగ్గాయి.
ముసందమ్ గవర్నరేట్ డిసెంబరు 2024 చివరి నాటికి గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే అత్యధిక ద్రవ్యోల్బణం 1.6 శాతంగా నమోదైంది. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లో ద్రవ్యోల్బణం 1.5 శాతం, అల్ వుస్తా గవర్నరేట్లో 1.4 శాతం పెరిగింది. అల్ దహిరా గవర్నరేట్లో ద్రవ్యోల్బణం రేటు 0.9 శాతం, అల్ బురైమి, అల్ దఖిలియా, ధోఫర్ గవర్నరేట్లలో ఒక్కొక్కటి 0.8 శాతం పెరిగింది. ఇది నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లో 0.7 శాతం, మస్కట్ గవర్నరేట్లో 0.6 శాతం మరియు నార్త్ అల్ బతినా గవర్నరేట్లో 0.5 శాతం పెరిగింది. అయితే దక్షిణ అల్ బతినా గవర్నరేట్లో ఇది 0.1 శాతం తగ్గింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







