సముద్ర మధ్యలో భారత జాతీయ జెండా
- January 26, 2025
విశాఖపట్నం: గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖలో మరొక సరికొత్త దేశభక్తి ప్రదర్శన జరిగింది. దేశభక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వ్యర్ధాల నుంచి సముద్రాన్ని కాపాడే పిలుపు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నది.స్వతంత్రత దినోత్సవం సందర్భంగా సముద్రంలో జరిగిన ఈ ప్రత్యేక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.స్కూబా డైవర్ బలరాం నాయుడు, తన స్నేహితులతో కలిసి, 76వ గణతంత్ర దినోత్సవాన్ని జాతీయ జెండాతో గుర్తుచేశారు. 78 అడుగుల లోతులో సుమారు అరగంట పాటు జాతీయ జెండాను ప్రదర్శించి, దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నారు.ఈ ప్రదర్శనకు ఆనంద్, సతీష్, నరేష్, రాజు సహా నలుగురు సభ్యులు పాల్గొన్నారు.ఈ ప్రదర్శనలో మువ్వనల జెండాతో నీటిలో రెపరెపలాడుతూ దేశభక్తిని ప్రదర్శించడం విశేషం. బలరాం నాయుడు నేతృత్వంలోని బృందం ఋషికొండ బీచ్ వద్ద సముద్రంలో డైవ్ చేసి, సాహసంతో కూడిన ప్రదర్శన చేశారు
సముద్ర మధ్యలో జాతీయ జెండా
జాతీయ జెండా 45 నిమిషాల పాటు నీటిలో రెపరెపలాడుతూ, దేశం కోసం త్యాగాలు చేసిన వారి ఆత్మగౌరవాన్ని చూపించారు.అంతేకాకుండా, ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రత్యేక ప్రస్తావన ఇచ్చారు. సముద్రంలో మున్నెళ్ల జెండా ప్రదర్శిస్తూ, ప్లాస్టిక్ వ్యర్ధాలను సముద్రం నుంచి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం సమాజానికి మేలు చేకూర్చే విధంగా నిర్వహించబడింది.ఇదే కాకుండా, స్కూబా డైవింగ్ ద్వారా అడ్వెంచర్ టూరిజాన్ని ప్రోత్సహిస్తూ ఈ జట్టు యువతకు ఒక సందేశం ఇచ్చింది. దీని ద్వారా సముద్ర జీవరాశులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తితో కూడిన ఈ విభిన్న ప్రదర్శన భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చేరవేసింది.
తాజా వార్తలు
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!
- భోగాపురం నుంచి తొలిరోజు 31 విమాన సర్వీసులు
- కొలంబియా భూకంప బాధితులకు యూఏఈ భారీ సాయం..!!
- ఖతార్లో వినియోగదారుల భద్రతకు పెద్దపీట..!!
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం







