భారత సాంస్కృతిక వైవిధ్యంపై కువైట్ రాయబారి ప్రశంసలు..!!
- January 28, 2025
కువైట్: ఇండియా సాంస్కృతిక, మత, జాతి వైవిధ్యం, సహకార స్ఫూర్తిని భారత్ లోని కువైట్ రాయబారి మెషల్ అల్షెమాలి ప్రశంసలు కురిపించారు. గణతంత్ర దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానం మేరకు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్, సైనిక కవాతుకు ఆయన హాజరయ్యారు. భారతదేశ సైనిక పురోగతి, సాంస్కృతిక వైవిధ్యం, సాంకేతిక ఆవిష్కరణలను పరేడ్ సందర్భంగా ప్రదర్శించారని రాయబారి పేర్కొన్నారు. కువైట్-భారత సంబంధాలను మరింత పటిష్టం చేయాలనే కువైట్ నాయకత్వం ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. గత డిసెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ పర్యటన రెండు స్నేహపూర్వక దేశాల మధ్య రాజకీయ, వాణిజ్య, ఆర్థిక, రక్షణ, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో కొత్త పునాదులు వేసిందని, సంబంధాలను మరింత సమగ్రంగా, వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లిందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!









