భారత సాంస్కృతిక వైవిధ్యంపై కువైట్ రాయబారి ప్రశంసలు..!!
- January 28, 2025
కువైట్: ఇండియా సాంస్కృతిక, మత, జాతి వైవిధ్యం, సహకార స్ఫూర్తిని భారత్ లోని కువైట్ రాయబారి మెషల్ అల్షెమాలి ప్రశంసలు కురిపించారు. గణతంత్ర దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానం మేరకు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్, సైనిక కవాతుకు ఆయన హాజరయ్యారు. భారతదేశ సైనిక పురోగతి, సాంస్కృతిక వైవిధ్యం, సాంకేతిక ఆవిష్కరణలను పరేడ్ సందర్భంగా ప్రదర్శించారని రాయబారి పేర్కొన్నారు. కువైట్-భారత సంబంధాలను మరింత పటిష్టం చేయాలనే కువైట్ నాయకత్వం ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. గత డిసెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ పర్యటన రెండు స్నేహపూర్వక దేశాల మధ్య రాజకీయ, వాణిజ్య, ఆర్థిక, రక్షణ, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో కొత్త పునాదులు వేసిందని, సంబంధాలను మరింత సమగ్రంగా, వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లిందన్నారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!
- ఐక్యరాజ్యసమితికి పురోగతి నివేదిక సమర్పించిన బహ్రెయిన్..!!







