గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి – 8 మందికి తీవ్రగాయాలు
- January 28, 2025
నంద్యాల జిల్లా చాపి రేవుల గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు సిలిండర్ పేలి ఇద్దరు దినేష్ (10),వెంకటమ్మ (60) మృతి చెందిన సంఘటన జరిగింది. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యా యి. నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. వీరందరినీ చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
గ్రామంలోని బాధిత బంధువులు పోలీసులు ఫైర్ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు ఇంటికి బంధువులు వచ్చారని మేరకు వారికి వంట చేయాలన్న ఉద్దేశంతో తెల్లవారుజామున నాలుగు గంటలకి వంట గదిలోకి వెళ్లారు. అప్పటికే గ్యాస్ లీకై ఇల్లంతా వ్యాపించి ఉండటంతో అక్కడ ఉన్నటువంటి లైట్ వేయగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ పేలుడు శబ్దం సంభవించింది. .భారీ పేలుడుకు ఇల్లు శిథిలావస్థమైపోయింది.పక్కనున్న ఇల్లుతో సహా కూడా కూలిపోయాయి. భారీ శబ్దానికి గ్రామస్తులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
బాధిత బంధువులు గ్రామస్తులు ఆ విషాద సంఘటన పట్ల రోదనలు ఏడుపులు చూపరులకు కంటనీరు చెప్పించాయి.ఇల్లు కూలిపోవడంతో శిదిలాల కింద భాగం బాధితులను బయటికి తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది తీవ్ర అవస్థలు పడ్డారు.
సంఘటన జరిగిన రెండు గంటలు శ్రమించి డ్రిల్లింగ్ మిషన్ తో ఇనుప కడ్డీలను తొలగించి అతి కష్టం మీద బాలుడు దినేష్ మృతదేహాన్ని వృద్ధురాలు వెంకటమ్మ మృతదేహాలను బయటికి తీశారు. మిగిలిన ఎనిమిది మందిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తుంది. పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు..
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









