మహాకుంభమేళాలో తొక్కిసలాట...17 మంది మృతి
- January 29, 2025
ప్రయాగ్రాజ్: ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో నేడు అపశ్రుతి జరిగింది.మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
దీంతో సెక్టార్-2లోని భక్తుల తాకిడికి బారికేడ్లు విరిగి భారీ తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో సుమారు 17 మంది మృతి చెందినట్లు సమాచారం..మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తుంది.ఈ ఘటనలో 50 మందికిపైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటన జరిగిన వెంటనే స్పందించిన సిబ్బంది.. గాయపడిన వారిని చికిత్స కోసం అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు.
కాగా, మౌని అమావాస్యను పురస్కరించుకుని మూడో అమృత స్నానం కోసం పెద్ద సంఖ్యలో ప్రయాగ్రాజ్కు భక్తులు తరలిరావడంతో బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది.
తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు మోదీ ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్







