2500 కోట్లతో నిర్మించబడుతున్న ఉస్మానియా హాస్పిటల్
- January 31, 2025
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి, హైదరాబాద్లోని ప్రఖ్యాత వైద్య సంస్థ, సరికొత్తగా, ఆధునిక సౌకర్యాలతో మారిపోతుంది.నిజాం కాలంలో ప్రారంభమైన ఈ ఆస్పత్రి, 100 ఏళ్ల పైచిలుకు చరిత్రను కలిగి ఉంది.కానీ, గత కొన్నేళ్లుగా శిథిలావస్థకు చేరింది. మరమ్మతులు, సిబ్బంది నిరసనలు, సౌకర్యాల అభావం ఈ ఆస్పత్రి యొక్క సవాళ్లుగా నిలిచాయి. రోడ్లు, వసతులు అనేవి కూడా సమస్యగా మారాయి.దీనికి పరిష్కారంగా, తెలంగాణ ప్రభుత్వం కొత్త ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది.శుక్రవారం, సీఎం రేవంత్ రెడ్డి మరియు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది.
కొత్త ఆస్పత్రి కోసం, ఉస్మానియా అస్పత్రి ఆవరణలో కాకుండా, గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో 26 ఎకరాల్లో నిర్మాణం చేపట్టబడింది.కొత్త ఆస్పత్రి లే అవుట్ ప్రకారం, మొత్తం 8 గేట్లు ఉంటాయి.మూడు గేట్ల ద్వారా ఆస్పత్రిలోకి ప్రవేశం ఉంటే, మిగిలిన గేట్లు సర్వీస్, మార్చురీ, హాస్టల్ మరియు అకడమిక్ విభాగాలకు సంబంధించినవి.ఈ కొత్త ఆస్పత్రి ప్రణాళికతో, పౌరులు, రోగులు, సిబ్బంది అంతా సౌకర్యంగా వుండేందుకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నాయి.నిర్మాణం విషయంలో, 2500 కోట్లతో, 14 అంతస్తుల ఆధునిక, ప్రపంచ స్థాయి ఆస్పత్రి నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ఆస్పత్రి 30 డిపార్ట్మెంట్లతో, 2000 పడకల సామర్థ్యంతో ఉండనుంది.నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ కాలేజీలతో పాటు, 750 సీట్లతో కూడిన భారీ ఆడిటోరియం కూడా ఉండబోతుంది.కొత్త హాస్పిటల్ డిజైన్లో ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఐసీయూ విభాగాలు ఉంటాయి.గౌరవనీయమైన డయాగ్నోస్టిక్ సేవలు, రోగి కుటుంబాల కోసం ధర్మశాల, సెక్యూరిటీ కోసం రెండు పోలీస్ ఔట్ పోస్టులు,ఫైర్ స్టేషన్ మరియు సబ్ స్టేషన్ కూడా నిర్మించబడతాయి.
మరిన్ని సౌకర్యాలు,క్లీనికల్ సేవలను అందించడానికి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్ఛురీ వ్యవస్థ కూడా ఏర్పాటుచేస్తున్నారు.అత్యవసర పరిస్థితులలో రోడ్డు ట్రాఫిక్ సమస్యలు లేకుండా, నలుగవైపులా రోడ్లను డిజైన్ చేయబడ్డాయి.ఒకేసారి 2 ఫ్లోర్లలో సెల్లార్ పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా, పార్కింగ్ సమస్యను పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం,ప్రస్తుత సిబ్బందికి, డాక్టర్లకు మరింత వృద్ధి,సౌకర్యం అందిస్తుంది. ఇది, తెలంగాణ రాష్ట్రానికి అత్యంత విలువైన వైద్య కేంద్రంగా మారుతుంది.
తాజా వార్తలు
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!
- ఐక్యరాజ్యసమితికి పురోగతి నివేదిక సమర్పించిన బహ్రెయిన్..!!
- ఖతార్ లో 17 ట్రావెల్, ఎయిర్ కార్గొ ఏజెన్సీలు సీజ్..!!
- మాదక ద్రవ్యాల రవాణా పై ఒమన్ పోలీసులు ఉక్కుపాదం..!!







