వింటర్ తహాయిమ్ సీజన్ 2025 ప్రారంభం..!!
- January 31, 2025
మస్కట్: "వింటర్ తహాయిమ్" సీజన్ రెండవ ఎడిషన్ జాలాన్ బని బు హసన్ విలాయత్లో ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. వినూత్న, ఆకర్షణీయమైన పద్ధతుల ద్వారా ఒమానీ వారసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.ఈ సంవత్సరం 'వింటర్ తహైమ్' సీజన్ సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ విశిష్ట వారసత్వం, సంస్కృతిని ప్రతిబింబిస్తుందని సౌత్ అల్ షర్కియా గవర్నర్ యాహ్యా బిన్ బదర్ అల్ మావలి అన్నారు.స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సాహించేందుకు, ఒమానీ SME, ఉత్పాదక కుటుంబాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.ప్రారంభ వేడుకలో లేజర్ లైటింగ్ షో, ఫైర్ వర్క్స్ అందరిని ఆకట్టుకున్నాయి.ఈ సీజన్లో సందర్శకుల కోసం "సాండ్ థియేటర్" కళాత్మక, సాంస్కృతిక, వారసత్వ ప్రదర్శనలు, ఎంటర్ టైన్ ప్రదర్శనలతోపాటు రెస్టారెంట్లు, కేఫ్లు అందుబాటులో ఉన్నాయి. 2024లో నిర్వహించిన "వింటర్ తహైమ్" సీజన్ మొదటి ఎడిషన్ 300,000 మంది సందర్శకులను ఆకర్షించింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







