వింటర్ తహాయిమ్ సీజన్ 2025 ప్రారంభం..!!
- January 31, 2025
మస్కట్: "వింటర్ తహాయిమ్" సీజన్ రెండవ ఎడిషన్ జాలాన్ బని బు హసన్ విలాయత్లో ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. వినూత్న, ఆకర్షణీయమైన పద్ధతుల ద్వారా ఒమానీ వారసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.ఈ సంవత్సరం 'వింటర్ తహైమ్' సీజన్ సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ విశిష్ట వారసత్వం, సంస్కృతిని ప్రతిబింబిస్తుందని సౌత్ అల్ షర్కియా గవర్నర్ యాహ్యా బిన్ బదర్ అల్ మావలి అన్నారు.స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సాహించేందుకు, ఒమానీ SME, ఉత్పాదక కుటుంబాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.ప్రారంభ వేడుకలో లేజర్ లైటింగ్ షో, ఫైర్ వర్క్స్ అందరిని ఆకట్టుకున్నాయి.ఈ సీజన్లో సందర్శకుల కోసం "సాండ్ థియేటర్" కళాత్మక, సాంస్కృతిక, వారసత్వ ప్రదర్శనలు, ఎంటర్ టైన్ ప్రదర్శనలతోపాటు రెస్టారెంట్లు, కేఫ్లు అందుబాటులో ఉన్నాయి. 2024లో నిర్వహించిన "వింటర్ తహైమ్" సీజన్ మొదటి ఎడిషన్ 300,000 మంది సందర్శకులను ఆకర్షించింది.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







