దుబాయ్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. టిక్కెట్లు గంటలోపే సోల్డౌట్..!!
- February 04, 2025
దుబాయ్: దుబాయ్లో జరిగే ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత మ్యాచ్ల టిక్కెట్లు సాయంత్రం 4 గంటలకు అమ్మకానికి పెట్టగా, సెకన్ల వ్యవధిలో అమ్ముడుపోయాయి. కేవలం 2 నిమిషాల్లో క్యూ 111,000గా చూపింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం టిక్కెట్లు బుక్ చేసుకోవాలని దాదాపు గంట సేపు క్యూలో నిరీక్షించిన క్రికెట్ అభిమానులకు చివరకు నిరాశే మిగిలింది. సెకన్ల వ్యవధిలో అన్ని కేటగిరీల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. వీటిలో ప్లాటినం కేటగిరీ ధర Dh2,000, ది గ్రాండ్ లాంజ్ కేటగిరీ ధర Dh5,000 ఇవి కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. చాలామంది అభిమానులు నిరాశ చెందాలు. ఈసారికి టీవీల్లోనే చూడాలని నిట్టూర్చారు. షార్జాకు చెందిన నమితా అనీష్ మాట్లాడుతూ.. ఇండియా-పాక్ మ్యాచ్కు హాజరు కావడానికి మొదట్లో క్యూలో ఉండగానే, తక్కువ రేట్ కేటగిరీ టిక్కెట్లు సోల్డౌట్ అయ్యాయని, దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో "చాలా ఖరీదైనవి" టిక్కెట్లను కొనుగోలు చేద్దామనుకుంటే అవి కూడా దక్కలేదని వాపోయారు. కానీ, దుబాయ్లో ఈ సంవత్సరం కనీసం ఒక మ్యాచ్ని చూడాలని నిశ్చయించుకున్న తనకు, ఇండియా vs న్యూజిలాండ్కు "జనరల్ అడ్మిషన్" టిక్కెట్ దక్కినట్లు తెలిపింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం మూడు మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది.ఫిబ్రవరి 20న ఇండియా vs బంగ్లాదేశ్, ఫిబ్రవరి 23న ఇండియా vs పాకిస్తాన్, మార్చి 2న ఇండియా vs న్యూజిలాండ్ మ్యాచ్ జరుగనుంది. మార్చి 4న తొలి సెమీఫైనల్కు, భారత్ పెద్ద మ్యాచ్కు అర్హత సాధిస్తే మార్చి 9న ఫైనల్కు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







