తలసేమియా బాధితులకు బాసటగా నారా భువనేశ్వరీ
- February 06, 2025
హైదరాబాద్: తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 15న విజయవాడలో మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్టు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వివరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో ఈ మ్యూజికల్ నైట్ జరగనుంది. విజయవాడలో గురువారం విలేకరుల సమావేశంలో కార్యక్రమాల వివరాలను భువనేశ్వరి, తమన్ వివరించారు.
తలసేమియా బాధితులు శ్వాస తీసుకోడానికి కూడా ఇబ్బంది పడతారని, వారి కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. తమన్ కూడా ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే మ్యూజికల్ నైట్ కి వస్తా అన్నారని, తమన్ ఈ షో ఫ్రీ గా చేస్తా అని గొప్ప హృదయంతో చెప్పారని భువనేశ్వరీ తెలిపారు. కార్యక్రమానికి అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ హాజరవుతున్నారని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ, తాను ఈ షో చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద కార్యక్రమం తనకు అప్పగించారని అన్నారు.ఈ షో ద్వారా వచ్చే ప్రతి రూపాయి తలసేమియా భాదితులకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..
- భారత్ లోనే తొలి గ్యాస్ ఏటీఎం
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!









