యూఏఈ అమ్ములపొదిలో అధునాతన వార్ షిప్..!!
- February 08, 2025
యూఏఈ: అత్యున్నత అంతర్జాతీయ మిలిటరీ స్పెసిఫికేషన్లతో రూపొందించబడిన అత్యాధునిక నౌకాదళ నౌకను షేక్ హమ్దాన్ ప్రారంభించారు.ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు.ఈ నౌక తన రక్షణ కార్యకలాపాలను బలోపేతం చేయడంతోపాటు సముద్ర భద్రతను మరింత పెంచుతుందని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాన మంత్రి, యూఏఈ రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పేర్కొన్నారు. అల్ ఎమారత్ కొర్వెట్ (P111) వైపు రెడ్ కార్పెట్పై నడిచే ఫోటోలు, వీడయోను షేర్ చేశారు.ఈ సందర్భంగా యుద్ధనౌక రూపకల్పన,అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వారిని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ప్రశంసించారు.
కొత్త యుద్ధనౌకలో అత్యాధునిక పనోరమిక్ సెన్సార్లు, బ్రేక్ లేని డేటా సేకరణ, ప్రాసెసింగ్ కోసం రూపొందించబడిన అధునాతన సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ యూనిట్ ఉన్నాయి.ఇది రాడార్లు, ఎలక్ట్రో-ఆప్టికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్, కమ్యూనికేషన్ యాంటెన్నాలతో సహా హై-టెక్ సెన్సార్ సిస్టమ్లను కలిగి ఉంది.ప్రత్యేక వాతావరణ వ్యవస్థలతో పాటు దాని కార్యాచరణ సంసిద్ధతను సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







