యూఏఈ అమ్ములపొదిలో అధునాతన వార్ షిప్..!!
- February 08, 2025
యూఏఈ: అత్యున్నత అంతర్జాతీయ మిలిటరీ స్పెసిఫికేషన్లతో రూపొందించబడిన అత్యాధునిక నౌకాదళ నౌకను షేక్ హమ్దాన్ ప్రారంభించారు.ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు.ఈ నౌక తన రక్షణ కార్యకలాపాలను బలోపేతం చేయడంతోపాటు సముద్ర భద్రతను మరింత పెంచుతుందని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాన మంత్రి, యూఏఈ రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పేర్కొన్నారు. అల్ ఎమారత్ కొర్వెట్ (P111) వైపు రెడ్ కార్పెట్పై నడిచే ఫోటోలు, వీడయోను షేర్ చేశారు.ఈ సందర్భంగా యుద్ధనౌక రూపకల్పన,అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వారిని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ప్రశంసించారు.
కొత్త యుద్ధనౌకలో అత్యాధునిక పనోరమిక్ సెన్సార్లు, బ్రేక్ లేని డేటా సేకరణ, ప్రాసెసింగ్ కోసం రూపొందించబడిన అధునాతన సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ యూనిట్ ఉన్నాయి.ఇది రాడార్లు, ఎలక్ట్రో-ఆప్టికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్, కమ్యూనికేషన్ యాంటెన్నాలతో సహా హై-టెక్ సెన్సార్ సిస్టమ్లను కలిగి ఉంది.ప్రత్యేక వాతావరణ వ్యవస్థలతో పాటు దాని కార్యాచరణ సంసిద్ధతను సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







