వర్క్ పర్మిట్ ఉల్లంఘనలకు భారీగా ఫైన్లు..షురా కౌన్సిల్ ఆమోదం..!!
- February 10, 2025
మనామా: కార్మిక ఉల్లంఘనలకు భారీ మొత్తంలో జరిమానాలు విధించనున్నారు.ఈ మేరకు ప్రతిపాదనలకు షురా కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 2024 చివరి రోజున పార్లమెంటు ఇప్పటికే ఆమోదించిన ప్రకారం..BD100 నుండి BD300 జరిమానాలు పెరిగాయి.తాజాగా వాటిని BD1,000 కి పెంచారు. అయితే, భారీ జరిమానాలు ప్రారంభమయ్యే ముందు గడువు ముగిసిన వర్క్ పర్మిట్లను క్రమబద్ధీకరించడానికి సంస్థలకు 14 రోజుల వరకు అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించారు. గత సంవత్సరం ఆగస్టులో హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా జారీ చేసిన డిక్రీ-లా ను ఇప్పుడు ఎగువ సభ ఆమోదించింది.
కమిటీ రిపోర్టర్ తలాల్ మహ్మద్ అల్ మనాయ్ మాట్లాడుతూ.. చట్టాన్ని అనుసరించేలా చూసుకుంటూ వ్యాపారాలు కొనసాగేలా అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు. "చాలా ఉల్లంఘనలు చెడు ఉద్దేశాలతో జరగవు. కానీ వ్యాపారాన్ని నిర్వహించడంలో రోజువారీగా కొంత గందరగోళం ఉంటుంది. ఈ డిక్రీ-చట్టం కంపెనీలు పరిస్థితులకు సరిపోని జరిమానాల కింద అణిచివేయబడకుండా కట్టుబడి ఉండేలా చేస్తుంది ”అని వివరించాడు. తాత్కాలిక కార్మిక మంత్రి యూసిఫ్ ఖలాఫ్ పాత నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని పేర్కొన్నారు.
షూరా కౌన్సిల్ యొక్క డిప్యూటీ చైర్పర్సన్ డాక్టర్ జెహాద్ అల్ ఫదేల్ మాట్లాడుతూ.. ఈ మార్పు అవసరమని అన్నారు. “ఇది దిద్దుబాటు. శిక్ష కాదు. వ్యాపారాలను మూసివేయడానికి జరిమానా విధించడం కాదు, తప్పులను సరిదిద్దడంలో వారికి సహాయపడటం లక్ష్యం. ”అని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







