ఈ నెల 8 న విడుదల కానున్న 'ఇద్దరం'

- July 01, 2016 , by Maagulf
ఈ నెల 8 న విడుదల కానున్న 'ఇద్దరం'

సంజీవ్‌, సాయికృప జంటగా రూపుదిద్దుకున్న చిత్రం 'ఇద్దరం'. సుధాకర్‌ వినుకొండ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూ.. దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక రొమాంటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌, వైజాగ్‌, మచిలీపట్నం, బీదర్‌లలో జరిగిందని చిత్ర బృందం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ చిత్రాన్ని జులై 8న రంజాన్‌ శుభాకాంక్షలతో విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని యూనిట్‌ సభ్యులు ధీమా వ్యక్తం చేశారు. ఇది నటుడు రంగనాథ్‌ నటించిన చివరి చిత్రం. జీవా, సూర్య, కౌటిల్య, బ్యాంక్‌ శ్రీనివాస్‌, ప్రభావతి, జబర్దస్త్‌ బాష తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com